Pushpa: తెలుగు సినిమా సత్తా ఏంటో ఒకప్పుడు “బాహుబలి” ప్రపంచానికి తెలియజేయగా తర్వాత ఐకాన్ స్టార్ బన్నీ నటించిన “పుష్ప” రుజువు చేసింది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా.. పాన్ ఇండియా నేపథ్యంలో.. రిలీజ్ అయిన పుష్ప… ఎవ్వరూ ఊహించని రీతిలో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఇండస్ట్రీలో సినీ ప్రముఖులతో పాటు దేశ విదేశాల క్రికెట్ ఆటగాళ్లు “పుష్ప”లో బన్నీ పలికిన డైలాగులు… వేసిన స్టెప్పులు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో ఎవరికివారు వేస్తూ పలుకుతూ.. వైరల్ అయ్యారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. “అలా వైకుంఠపురం” నుండి బన్నీ స్టెప్ లని… సోషల్ మీడియాలో రీమేక్ చేసి వేయటం.. తర్వాత పుష్ప కి కూడా అదే రీతిలో.. డేవిడ్ వార్నర్ వీడియోలు చేయడం జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా “పుష్ప” సూపర్ డూపర్ హిట్టయి మంచి గుర్తింపు దక్కించుకుంది. అటువంటి ఈ సినిమా.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోకి రెడీ అయింది. తాజాగా టెలివిజన్ ప్రీమియర్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మేకర్స్ రివీల్ చేశారు. విషయంలోకి వెళితే ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి “పుష్ప” ప్రీమియార్ నీ… ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో…సునీల్, అనసూయ భరద్వాజ్, ఫహద్ ఫాజిల్ తదితరులు అత్యుత్తమ నటనను కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. ఇదిలా ఉంటే పుష్ప సెకండ్ పార్ట్ కి సంబంధించి షూటింగ్ త్వరలో మొదలు పెట్టనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!