Radhe shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ‘రాధేశ్యామ్’ మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్స్ ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకోవడంతో ముందు నుంచే ఈ సినిమా ఖచ్చితంగా ఓ విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రభాస్ అభిమానులే కాదు ప్రతీ ఒక్కరు చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ చిత్రాన్ని యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరిగా తెరకెక్కించారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. భాగ్యశ్రీ ఇందులో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, ఆమె మొదటిసారి తెలుగు తెరపై కనిపించబోతోంది. సీనియర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా చాలాకాలం తర్వాత స్క్రీన్ మీద కనిపించబోతున్నారు.
ప్రభాస్ సినిమాకు మొదటిసారి నలుగురు సంగీత దర్శకులు పనిచేయడం విశేషం. సౌత్ భాషలకు గానూ జస్టిన్ ప్రభాకరన్, హిందీ భాషలలో మిథూన్ – మనన్ భరద్వాజ్, అన్నీ భాషలకు గానూ మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు థమన్ క్లాస్ చిత్రాలకు సంగీతం అందించలేదు. ఆయన సంగీతంలో మోత ఎక్కువగా ఉంటుందని ఎప్పటి నుంచో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే, అది రాధే శ్యామ్ సినిమాకు ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మారిపోతుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకు తన ఇమేజ్ను పక్కన పెట్టి పుర్తిగా కొత్త తరహాలో క్లాసీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నారట.
Radhe shyam: కొత్త కంటెంట్తో ప్రమోషన్స్
ఇక మార్చి 11వ తేదీన ప్రభాస్ – పూజా హెగ్డేల రాధే శ్యామ్ సినిమాను అత్యంత భారీ స్థాయిలో 7 భాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ కొత్త కంటెంట్తో ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా సూపర్ హిట్ లిరికల్ సాంగ్ అయిన ఈ రాతలే వీడియో ప్రోమోను వదిలారు. గ్రాండ్ విజువల్స్లో ఉన్న ఈ రాతలే ప్రోమో సాంగ్ ఉండబోతుందని అర్థమవుతోంది. ఇప్పటి వరకు నాలుగు లిరికల్ వీడియో సాంగ్స్ వచ్చాయి. త్వరలో మిగతా రెండు సాంగ్స్ కూడా రిలీజ్ కానున్నాయి. సాహో లాంటి యాక్షన్ సినిమా తర్వాత కంప్లీట్ డిఫరెంట్ జోనర్లో రాబోతున్న రాధే శ్యామ్ ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!