Vijay devarakonda: పెళ్ళి చూపులు..ద్వారక..గీత గోవిందం లాంటి క్లాస్ సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ చేసిన ‘అర్జున్ రెడ్డి’ ఎంతటి సంచలనం సృష్ఠించి రౌడీ హీరో అనే ఇమేజ్ తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిందే. ఈ ఒక్క సినిమా విజయ్ క్రేజ్ను విపరీతంగా పెంచేసింది. ఒక్క టాలీవుడ్లో మాత్రమే కాకుండా బాలీవుడ్లో కూడా విజయ్ మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. దాంతో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పాన్ ఇండియా సినిమాగా లైగర్ను విజయ్ దేవరకొండతో రూపొందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చినవన్నీ భారీ స్థాయిలో అంచనాలను పెంచాయి.
ఇక లైగర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో సౌత్ ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది అనన్య పాండే. పూరి జగన్నాథ్ – ఛార్మి – బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ కలిసి దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్తో పూరి కనెక్ట్స్ – ధర్మ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా ఇదే ఏడాది ఆగస్టు నెలలో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అయితే విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అనే ఇమేజ్ను దక్కించుకోవడం ఖాయమని ఇటీవల వచ్చిన టీజర్తో అర్థమైంది. దాంతో నెక్స్ట్ సినిమాలను ఇక అదే రేంజ్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట.
Vijay devarakonda: లైగర్ కాంబో మరోసారి రిపీట్..!
గత ఏడాది ప్రకటించిన సినిమాను ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు రానున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా ఈ సినిమాను ముందు కేవలం తెలుగులోనే నిర్మించాలని భావించారు. కానీ, లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ మార్కెట్ ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్లో భారీగా పెరగుతుందని చెప్పుకుంటున్నారు. అందుకే, ఇప్పుడు శివ నిర్వాణ – విజయ్ దేవరకొండ మొదలవబోయే సినిమాను హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించి రిలీజ్ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇదే కాదు లైగర్ కాంబో మరోసారి రిపీట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబోలో జనగణమన పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!