PK Sequel : బాలీవుడ్ ఇండస్ట్రీ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే అమీర్ ఖాన్ నటించిన “పీకే” సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ప్రజల్లో ఉన్న మత విశ్వాసాలు, మూఢ భక్తిని వాడుకుంటూ దొంగ బాబాలు వారిని ఎలా దోచుకుంటున్నారో తెలియజేస్తూ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కేవలం విజయం సాధించడమే కాకుండా విడుదల సమయంలో మత విశ్వాసాలను ప్రశ్నించినందుకు ఈ సినిమాపై భారీగా చర్చలు జరిగాయి. 2014 లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అంటూ ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు.
అభిమానులు ఎదురుచూస్తున్న ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే రాబోతుందనే వార్త ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. పీకే చిత్రం క్లైమాక్స్ లో.. తన పని ముగించుకుని గ్రహాంతరవాసిగా తన గ్రహానికి వెళ్లిపోయిన అమీర్ ఖాన్ తర్వాత రణబీర్ కపూర్ ను తీసుకురావడంతో ఈ సినిమాకి ముగుస్తుంది. అయితే కేవలం ఈ సీన్ ద్వారా మాత్రమే ఈ సినిమాకు సీక్వెల్ తప్పకుండా ఉంటుందని దర్శకనిర్మాతలు చెప్పగానే చెప్పారు. పీకే సినిమా సీక్వెల్ గురించి నిర్మాత
వినోద్ చోప్రా మీడియాతో మాట్లాడారు.
పీకే సినిమాతో పాటు ఆ సినిమా సీక్వెల్ :
వినోద్ చోప్రా మీడియాతో మాట్లాడుతూ… పీకే సినిమా క్లైమాక్స్ లో రణబీర్ కపూర్ ను తీసుకురావడంతో ఈ సినిమా ముగుస్తుంది. దీని ఆధారంగా ఈ సినిమాకు సీక్వెల్ కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ సినిమాకు సంబంధించిన కథను ఇప్పటివరకు అభిజాత్ రాయలేదు. ఈ కథ తయారైన వెంటనే పీకే సినిమా సీక్వెల్ పట్టాలెక్కుతోందని ఈ సందర్భంగా వినోద్ చోప్రా మీడియాకు తెలియజేశారు. కేవలం పీకే సినిమా మాత్రమే కాకుండా మున్నాభాయ్ సినిమా సీక్వెల్ కూడా చేయాలని ఉందని వినోద్ చోప్రా తెలిపారు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఎంతటి విజయాన్ని సాధించాయో అందరికి తెలిసిందే. అయితే కథ అన్ని కుదిరితే కచ్చితంగా ఈ రెండు సినిమాలు సీక్వెల్స్ వస్తాయని వినోద్ చోప్రా ఈ సందర్భంగా తెలిపారు
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!