SSMB 28: “సర్కారు వారి పాట” సూపర్ డూపర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ వచ్చే నెల జులై నుండి తన నెక్స్ట్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా వర్కింగ్ టైటిల్ “SSMB 28”. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో “అతడు”, “ఖలేజా” తెరకెక్కడం జరిగాయి. రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో వస్తున్న ఈ మూడో సినిమా పై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే త్రివిక్రమ్ ఈ సినిమాలో మహేష్ బాబుని రెండు డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించడానికి డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. సో “SSMB 28″లో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు అని ఇండస్ట్రీలో టాక్. దీంతో ఇప్పటికే మెయిన్ హీరోయిన్ పూజ హెగ్డే అని సినిమా యూనిట్ అధికారికంగా తెలియజేయడం జరిగింది. అయితే స్క్రిప్టు మేరకు… డబల్ క్యారెక్టర్ లో మహేష్ కనిపిస్తూ ఉండటంతో… సెకండ్ హీరోయిన్ కి అవకాశం ఉండటంతో.. రష్మిక మందననీ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు టాక్.
“పుష్ప”తో పాన్ ఇండియా నేపథ్యంలో రష్మిక మందనకి మంచి గుర్తింపు ఉండటంతో.. సినిమాలో రష్మిక మందన కి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ త్రివిక్రమ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో డబల్ క్యారెక్టర్ మహేష్ సెకండాఫ్ నుండి.. కనిపించనున్నట్లు.. సినిమాకి హైలెట్ గా ఈ క్యారెక్టర్ వుండనునట్లు వార్తలు వస్తున్నాయి. వరుసపెట్టి బ్యాక్ టు బ్యాక్ మహేష్ విజయాలు సాధించడంతో పాటు “అలా వైకుంఠపురంలో” వంటి బ్లాక్ బస్టర్ విజయం త్రివిక్రమ్ సాధించటంతో ఇద్దరు ఫామ్ లో ఉండటంతో..”SSMB 28″ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!