AP CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ నెల 23న తిరుపతి, శ్రీకాళహస్తిలో పర్యటించనున్నారు. 23వ తేదీ ఉదయం గన్నవరం నుండి విమానంలో బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాఫ్టర్ లో తిరుపతి రూరల్ మండలం పేరూరు వద్ద నిర్మితమైన వకుళమాత ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పేరూరు నుండి హెలికాఫ్టర్ లో శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు గ్రామానికి చేరుకుంటారు. ఇనగలూరు వద్ద రూ.700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న అపాచి పాదరక్షల తయారీ పరిశ్రమకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అనంతరం పరిశ్రమ ప్రతినిదులతో భేటీ అవుతారు. ఆ తరువాత అక్కడి నుండి హెలికాఫ్టర్ లో తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గాన విమానాశ్రయం పక్కనే శ్రీవెంకటేశ్వర ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ – 1 ను సందర్శిస్తారు. ఆ ప్రాంగణంలో టీసిఎల్ పరిశ్రమకు సంబంధించి అనుబంధ యూనిట్ల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమాల అనంతరం తిరుపతి విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 2.40 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు, అక్కడ నుండి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. కాగా సీఎం జగన్ తిరుపతి, శ్రీకాళహస్తి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను చేస్తొంది.