వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సందీప్ మాధవ్ టైటిల్పాత్రలో ‘దాదాస్ ఆఫ్ హైదరాబాద్’ అనే సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించాడు. రాంగోపాల్ వర్మ ఏకధాటిగా సినిమాలు చేయడమే కాదు.. వాటిని బేస్ చేసుకుని ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే రాంగోపాల్ వర్మే అని టక్కున చెప్పేయవచ్చు. ఇప్పుడు ఈయన తన తదుపరి సినిమాను అనౌన్స్ చేశాడు. “నేను ఈరోజునే ‘జార్జిరెడ్డి’ సందీప్ మాధవ్తో సైన్ చేయించాను. విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టుల తర్వాత నేను హైదరాబాద్లోని దాదాలపై సినిమా చేయబోతున్నాను. నా సినిమా శివకు ఇన్స్పిరేషన్గా నిలిచిన ఓ వ్యక్తి కథే ఇది’ అంటూ మెసేజ్ పోస్ట్ చేశాడు. ‘వంగవీటి’ తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో సందీప్ మాధవ్ నటించబోయే చిత్రమిదే అవుతుంది. ప్రస్తుతం సందీప్ మాధవ్ టైటిల్ పాత్రలో నటించిన ‘జార్జిరెడ్డి’ నవంబర్ 22న విడుదలవుతుంది.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!