Lokesh Kanagaraj: టాలీవుడ్ స్టార్ హీరోలు చాలావరకు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ కి చెందిన దర్శకులతో పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది బాలీవుడ్ హీరోలు.. ఆల్రెడీ పని చేసి సూపర్ డూపర్ హిట్ లు కూడా అందుకోవడం జరిగింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ..అట్లీ తో పని చేస్తుంటే ఇప్పుడు.. సల్మాన్ ఖాన్ సౌత్ ఇండియాకి చెందిన స్టార్ డైరెక్టర్ తో కలిసి చేసే ఆలోచన చేస్తున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో గట్టి టాక్ నడుస్తోంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇప్పటికే లోకేష్ కనగరాజ్ తలపతి విజయ్ తో ” మాస్టర్” చేసి సూపర్ డూపర్ హిట్ అందుకోగా ఇటీవల కమలహాసన్ నీ ప్రధాన హీరోగా పెట్టి తెరకెక్కించిన “విక్రమ్” తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం జరిగింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ నీ షేక్ చేసి పడేసిన “కేజిఎఫ్ 2” కంటే మరింత వైలెంట్ గా “విక్రమ్” ఉండటంతో.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. దీంతో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంటిలో “విక్రమ్” సినిమా యూనిట్ మొత్తంకి పార్టీ ఇవ్వడం జరిగింది.
ఈ పార్టీలో సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంలో సల్మాన్ కి లోకేష్ కనగరాజ్.. చిన్న స్టోరీ లైన్ వినిపించినట్లు. ఓకే చెప్పినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. త్వరలోనే పూర్తి స్టోరీ మరోసారి.. సల్మాన్ కి వినిపించి ఆ తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. అంతా ఓకే అయితే పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు సమాచారం. లేకపోతే విజయ్ నటించిన “మాస్టర్” సినిమాను హిందీలో రీమేక్ చేసే రీతిలో సల్మాన్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!