Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘భీమ్లా నాయక్’ ఈ నెల 25 వ తేదీన భారీ స్థాయిలో థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ‘భీమ్లా నాయక్’ చిత్ర బృందం బుధవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ను అత్యంత భారీ స్థాయిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ గ్రాండ్ ఈవెంట్లో హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి- దర్శకుడు త్రివిక్రమ్, సాగర్ కె చంద్ర అలాగే, హీరోయిన్ సంయుక్త మీనన్ హాజరయ్యారు. కానీ, ఒక్కరు మాత్రం మిస్సయ్యారు. ఆమె ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యగా నటించిన హీరోయిన్ నిత్యామీనన్.
‘భీమ్లా నాయక్’లో పవన్ కు జోడీగా నిత్యామీనన్ నటించగా ఇటీవల వచ్చిన ట్రైలర్లో ఆమె డైలాగ్స్, పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. సౌత్లో ఉన్న టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్లో నిత్యామీనన్ ఒకరు. ఆమె ఎంచుకునే సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక ఆమె ఇప్పటి వరకు నటించిన ఏ సినిమా ప్రమోషనల్ ఈవెంట్కు కూడా మిస్ అవలేదు. అలాంటిది ‘భీమ్లా నాయక్’ ఈవెంట్ ఎందుకో మిస్ అయ్యారు. అందరూ ఈ ఈవెంట్లో నిత్యా చాలా స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తారని భావించారు. కానీ, రానా సరసన నటించిన సంయుక్త మీనన్ మాత్రమే సందడి చేసింది.
Bheemla Nayak: ఆ రోజు గనక అయితే నిత్యా వచ్చి ఉండేదట.
ఆమె కాసేపు స్పీచ్ ఇచ్చి కూడా అందరినీ ఆకట్టుకుంది. దాంతో నిత్యా ఎందుకు రాలేదనే టాక్ వినిపిస్తోంది. ఎదో మేకర్స్తో క్రియేటివ్ డిఫ్రెన్సెస్ వల్లే ఆమె ఈ ఈవెంట్కు రాలేదని చెప్పుకుంటున్నారు. కానీ, అసలు విషయం అది కాదట. నిత్యా ఆహా కోసం జడ్జ్గా వ్యవహరిస్తున్నారు. అలాగే, ఓ వెబ్ సిరీస్ కూడా కమిటయ్యారు. ఇటీవలే ఆ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలైందట. ప్రస్తుతం ఆ షూటింగ్లోనే ఆమె పాల్గొంటూ బిజీగా ఉండటం వల్లే ఈ ఈవెంట్కు రాలేకపోయిందని తెలుస్తోంది. వాస్తవంగా ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ 21వ తేదీనే జరగాల్సింది. ఆ రోజు గనక అయితే నిత్యా వచ్చి ఉండేదట. కానీ, అనూహ్యంగా ఈవెంట్ పోస్ట్పోన్ అవడంతో డేట్ సర్దుబాటు చేయలేక రానట్టు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!