తమిళ చిత్ర సీమకు చెందిన సీనియర్ రైటర్ జె.మహేంద్రన్ అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్య కారణంగా ఆయన అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నిన్న(సోమవారం) హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. నేటి ఉదయం మహేంద్రన్ చనిపోయినట్లు ఆయన తనయుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు. 1966లో రైటర్గా ఎంట్రీ ఇచ్చిన జె.మహేంద్రన్ తర్వాత దర్శకుడిగా మారి 12 సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఈయన డైరెక్ట్ చేసిన చిత్రాల్లో “ముళ్ళుమ్ మలారం, ఉతిరిపూక్కల్, నెంజతై కిల్లదె“ లాంటి తమిళ సినిమాలున్నాయి. నటుడిగా కూడా ఆయన తనదైన మార్కును చూపించారు.
మహేంద్రన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు. ఈరోజు సాయంత్రం మహేంద్రన్ అంత్యక్రియలు జరుగుతాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!