SVP: “సర్కారు వారి పాట” మరి కొద్ది గంటల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొత్తం కంప్లీట్ అయిపోయాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అనేది సస్పెన్స్ గా నెలకొంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మహేష్ సినిమా తెరపై పడుతూ ఉండటంతో.. ఇప్పటికే సర్కారు వారి పాట థియేటర్ల వద్ద భారీ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మరో పోకిరి అవుతుందని మహేష్ చెప్పటంతో పాటు సినిమా రికార్డింగ్ చేస్తున్న సమయంలో… తమన్ దాదాపు నలభై సార్లు చూసినట్లు.. పక్కా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం ఖాయం అని పేర్కొన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సర్కారు వారి పాట కి సంబంధించి టికెట్ ధరలు పెంచుకునే దిశగా మొన్ననే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం “సర్కారు వారి పాట”కి సంబంధించి స్పెషల్ షో లకు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ సిటీ పరిధిలో ఉండే బ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాథ్, శ్రీ రాములు అంటే ఈ నాలుగు థియేటర్లలో సర్కారు వారి పాట స్పెషల్ షో లు పడుతున్నాయి.
తెల్లవారుఝాము నాలుగు గంటలనుండి నాలుగు థియేటర్లలో స్పెషల్ షోలు పడనున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరగటంతో సినిమా కి కొద్దిగా పాజిటివ్ టాక్ వస్తే చాలు… బాబు మరోసారి బాక్సాఫీస్ వద్ద కొత్త లెక్కలు రాస్తారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. హరి సర్కార్ వారి పాట రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!