Naresh: నిన్న మీడియాలో తెలుగు ఇండస్ట్రీ సమ్మె గురించి వచ్చిన కధనాలు గురించి అందరికీ తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర సీమ నేడు స్తంభించిపోయింది. కార్మికులు మూకుమ్మడిగా తెలుగు పరిశ్రమ మీద మౌనంతో దాడి చేసారు. ఈ రచ్చ అంతా వేతనాల కోసమే అని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇక సినీ కార్మికులు లేకపోవడంతో ఎక్కడికక్కడ షూటింగ్లు ఆగిపోయాయి. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ తక్షణమే సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. ఇదే క్రమంలో సీనియర్ నటుడు నరేష్ ఈ సమ్మె గురించి, ఇండస్ట్రీ గురించి చెబుతూ వీడియోను షేర్ చేశాడు.
వీడియోలో ఏముంది?
నరేష్ మాట్లాడుతూ… “తెలుగు సినిమా బిడ్డలకు నమస్కారం. షూటింగ్లు ఆగిపోతాయ్ అంటూ నిన్నటి నుంచి వస్తున్న వార్తలు మీడియాలో మార్మోగిపోతోన్నాయి. వేతనాలు పెంచకపోతే షూటింగ్లు ఆపేస్తామంటూ ఒకటి, రెండు యూనియన్లు పోరాటం చేస్తున్నాయి. అయితే దీనిపై పెద్దలందరూ చర్చించి ఓ నిర్ణయం తప్పకుండా తీసుకుంటారు. కానీ ఇక్కడ మనమంతా ఓ విషయం మర్చిపోయాము. 3 సంవత్సరాలుగా కరోనా వలన ప్రపంచంతో పాటు, సినీ పరిశ్రమ కూడా అట్టడుగుకు వెళ్లిపోయింది. పూటకు గతి లేకుండా తయారయ్యింది జీవితం. ఎంతో మంది ప్రాణాలు పోయాయి. ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ వెంటిలేటర్ మీద ఊపిరి పీల్చుకుంటోంది. సినిమాలు విడుదల అవుతున్నాయి. పరిశ్రమకు మంచి పేరు వస్తోంది. మనకు బ్యాంకులు నిండకపోయినా కంచాలు నిండుతున్నాయి.
But we should remember that the majority of the TFI mainly the families of small technicians & actors went without food & medication & the producers suffered severe financial setbacks & just recuperating. Almost 20 units are in outdoor locations.
(2/3) pic.twitter.com/VzgQzE3ewF— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 22, 2022
దీనిపై మనందరం ఒకసారి ఆలోచించాలి.. తప్పకుండా అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. ఇలా సడెన్ గా స్ట్రైక్ అంటే చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది. నిర్మాతలు, దర్శకులు, కార్మికులు, జూనియర్ ఆర్టిస్టుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. మొత్తం మునిగిపోతోన్నామని లబోదిబో అంటున్నారు. ఇండస్ట్రీ బిడ్డగా చెబుతున్నా.. వారి డిమాండ్ మేరకు ఎంతో కొంత వేతనాన్ని పెంచాలి. అదే సమయంలో కరోనా సమయంలో సినిమాలు ఆగిపోయి.. వడ్డీలు కట్టలేని పరిస్థితిలోకి నిర్మాతలు వెళ్లారు. వాళ్ళ సైడ్ కూడా ఆలోచించాలి. ఫెడరేషన్కి, నిర్మాతలకు ఇబ్బంది లేకుండా అందరం కలిసి ఎక్కడో ఓ పాయింట్కు రావడం పెద్ద కష్టమేమీ కాదు. పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకుని, ఈ షూటింగ్లు ముందుకు సాగేలా ఓ అండర్ స్టాండింగ్కు రావాలని కోరుకుంటున్నాను. జై తెలుగు పరిశ్రమ.. జై సినిమా తల్లి పరిశ్రమ” అని మాట్లాడారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!