Prabhas: ఇప్పటి వరకు ప్రభాస్ మాస్, క్లాస్, యాక్షన్ సినిమాలు ఎన్నో చేశారు. బాహుబలి సిరీస్తో పాన్ ఇండియన్ స్టార్గా మారారు. ప్రస్తుతం పీరియాడికల్ లవ్స్టోరిగా రాధే శ్యాం సినిమా చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దీనికి దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్. సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ ఇతిహాసంగా ఆదిపురుష్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన రాముడిగా కనిపిచబోతున్నారు. సీతగా కృతీ సనన్ కనిపించబోతోంది.
అలాగే యాక్షన్ చిత్రాల దర్శకుడిగా కేజీఎఫ్ సిరీస్తో పాపులారిటీని తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న సలార్ సినిమాలో చేస్తున్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇదే క్రమంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమాను చేస్తున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్గా తెరకెక్కుతుండగా ఇందులో బాలీవుడ్ స్టార్స్ దీపిక పదుకొనె హీరోయిన్గా బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే వీటన్నిటికంటే
భిన్నమైన చిత్రంగా స్పిరిట్ తెరకెక్కనుంది.
Prabhas: ఆ డ్రీమ్ ను ఇప్పుడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ నిజం చేయబోతున్నాడు.
టాలీవుడ్లో అర్జున్ రెడ్డి వంటి సెన్షేషనల్ చిత్రాన్ని తీసిన సందీప్ రెడ్డి వంగ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ డ్రీం రోల్ అయిన పోలీస్ ఆఫీసరీర్ పాత్రలో నటిస్తుండటం విశేషం. ప్రభాస్ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమాలోనూ పోలీస్గా నటించలేదు. ఇది ప్రభాస్కు మాత్రమే కాదు ఆయన అభిమానులకు పెద్ద డ్రీమ్. ఎట్టకేకలు ఆ డ్రీమ్ ను ఇప్పుడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ నిజం చేయబోతున్నాడు. తాజాగా ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్ మేకర్ టీ సిరీస్ భూషణ్ కుమార్ వెల్లడించారు. దాంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!