Pawan Kalyan: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, అత్తారింటికి దారేది రెండు సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు సృష్టించాయి. పైగా త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ అంటే అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ కి అత్యంత క్లోజ్ ఫ్రెండ్ కావటంతో త్రివిక్రమ్ అంటే పవన్ అభిమానులు కూడా విపరీతంగా గౌరవిస్తారు.
కాగా త్రివిక్రమ్ ప్రస్తుతం నటించిన “బీమ్లా నాయక్” సినిమాకి స్క్రీన్ ప్లే తో పాటు డైలాగ్ రావడం తెలిసిందే. అయితే ఇది కాకుండా త్రివిక్రమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ తో పాటు మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించనున్నారట. సబ్జెక్ట్ విని పవన్ కూడా ఒకే అన్నట్లు త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతం త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అయిన వెంటనే పవన్ కళ్యాణ్ … సాయి ధరమ్ తేజ్ మల్టీ స్టార్ ప్రాజెక్ట్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ ట్రెండ్ దిశగా మెగా హీరోలకు మాటల మాంత్రికుడు స్టోరీ రాసినట్లు పాన్ ఇండియా తరహాలో… సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పొలిటికల్ నేపథ్యంలో సినిమా స్క్రిప్ట్ ఉండే దిశగా త్రివిక్రమ్ కథ సిద్ధం చేసినట్లు సమాచారం. మహేష్ మూవీ అయిన వెంటనే ఈ మెగా ప్రాజెక్ట్ మొదలెట్టా నున్నారట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!