మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికి ఎనిమిది మంది హీరోలున్న విషయం తెలిసిందే. అందరికీ మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు మెగాభిమానుల అండదండలు ఉండాల్సిందే. ఇప్పుడు అదే కాంపౌండ్ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. శంకర్ దాదా ఎంబీబీఎస్, జానీ సినిమాల్లో బాల నటుడిగా నటించాడు. ప్రస్తుతం హీరోగా ఆయన నటించిన సినిమా ‘ఉప్పెన’. మరో వారంలో రిలీజ్ అనగా కరోనా, లాక్ డౌన్ పరిస్థితుల్లో సినిమా వాయిదా పడిపోయింది. ఈ సినిమా ఓటీటీల్లో వస్తుందని గతంలో చాలా గాసిప్స్ వచ్చాయి. ఇప్పుడు మరింత లేట్ కావడంతో ఇక ఓటీటీనే దిక్కు అనే వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సినిమాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటీటీల్లో విడుదల చేసేందుకు మైత్రీ బ్యానర్ సిద్ధంగా లేదని తెలుస్తోంది. సినిమాకు దాదాపు 20కోట్లు బడ్జెట్ పెట్టడమే కాదు.. సినిమా ఖచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకమే కారణమని తెలుస్తోంది. ఈ సినిమా ధియేటర్లలో మ్యాజిక్ చేస్తుందని టీమ్ భావిస్తోందని సమచారం. ధియేటర్లు ఎప్పుడు రీఓపెన్ అయితే అప్పుడే సినిమాను విడుదల చేద్దామనే నిర్ణయంలో ఉన్నారట. పైగా మెగాస్టార్ మేనల్లుడు, మెగా ఫ్యాన్స్ ఆదరణ కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట.
అందుకే ఈ సినిమాను ఆలస్యమైనా కంగారు పడటం లేదని తెలుస్తోంది. సినిమాలోని పాటలు ఇప్పటికే యూట్యూబ్ సంచలన రికార్డులు క్రియేట్ చేశాయి. దేవిశ్రీ ప్రసాద్ తన మ్యాజిక్ రిపీట్ చేయడమే కారణం. వైష్ణవ్ తేజ్ కు జోడీగా కృతి శెట్టి నటించింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషించాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!