Virata Parvam Trailer: రానా దగ్గుబాటి, సాయి పల్లవి తొలిసారి జంటగా నటించిన చిత్రం `విరాటపర్వం`. నక్సలిజం బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.
ఉత్తర తెలంగాణలో 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో ప్రియమణి, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనేక వాయిదాల అనంతరం ఈ చిత్రాన్ని జూలై 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ రిలీజ్ డేట్ను జూన్ 17కు ప్రీపోన్ చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. మేకర్స్ ప్రమోషన్స్ను షురూ చేశారు. ఇందులో భాగంగానే తాజాగా విరాటపర్వం ట్రైలర్ను బయటకు వదిలేందుకు డేట్ను లాక్ చేశారు. ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ను జూన్ 5, 2022న విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొద్ది సేపటి క్రితమే ప్రకటించారు.
ఇదంతా బాగానే ఉంది కానీ.. రానీ, సాయి పల్లవిల ఫ్యాన్స్లో కొంత టెన్షన్ నెలకొంది. టెన్షన్ ఎందకా అని అనుకుంటున్నారు.. అందుకు ఓ కారణం ఉంది. ఇటీవల కాలంలో నక్సలిజం బ్యాక్డ్రాప్లో వచ్చిన చిత్రాలేమి ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోతున్నాయి. ఇందుకు ఇటీవల విడుదల `ఆచార్య` పెద్ద నిదర్శనం. ఈ నేపథ్యంలోనే నక్సలిజం నేపథ్యంలో రానున్న `విరాటపర్వం` ఎంతవరకూ ప్రేక్షకులను ఆకట్టుకుంది..? అన్న ప్రశ్నే అభిమానులను కలవరపెడుతోంది.
Love is the biggest form of revolution!❤️🔥#VirataParvam Trailer on June 5th.#VirataParvamOnJune17th@RanaDaggubati @Sai_Pallavi92 @nanditadas @venuudugulafilm #SureshBobbili #DivakarMani @dancinemaniac @SureshProdns @SLVCinemasOffl @LahariMusic pic.twitter.com/UU3qcKqUOU
— Suresh Productions (@SureshProdns) June 3, 2022
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!