Prabhas: ప్రభాస్ చేస్తున్న ఈ పనికి టాలీవుడ్ హీరోల మైండ్ బ్లాక్ అవుతుందా..? అవునని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారట. అప్పట్లో హీరో శోభన్ బాబు సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వ్యాపారాలలో పెట్టి రెట్టింపు లాభాలు సంపాదించారు. అప్పట్లో బిజినెస్ వ్యవహారాలలో చాలామంది హీరోలు శోభన్ బాబునే ఫాలో అయ్యారు. సీనియర్ నటుడు మురళీ మోహన్ కూడా వ్యాపార పరంగా ఆయననే ఇప్పటికీ ఫాలో అవుతుంటారని అంటుంటారు. ఇక ప్రస్తుతం మన స్టార్ హీరోలు కూడా సినిమా ద్వారా సంపాదించిన డబ్బును ఇతర వ్యాపారాలలో పెడుతున్న విషయం తెలిసిందే.
మహేశ్ బాబు, నిర్మాతగా, మల్టీప్లెక్స్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కూడా మల్టీప్లెక్స్ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నారు. ప్రభాస్ కూడా నెల్లూరులో మల్టీప్లెక్స్ చైన్ థియేటర్స్ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. యూవీ క్రియేషన్స్లో కూడా తన పెట్టుబడులున్నాయట. నేచురల్ స్టార్ నాని కూడా నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరోలు మాత్రమే కాదు స్టార్ హీరోయిన్స్ కూడా ఇలా పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి బాగా సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే, వీరందరూ ఎక్కువగా వ్యాపారాలు మొదలు పెట్టింది ఇండియాలోనే.
Prabhas: నెట్టింట ఈ వార్త వైరల్గా మారింది.
కానీ, మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మాత్రం విదేశాలలో వ్యాపారం ప్రారంభించనున్నారని తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ స్పెయిన్లోని ప్రశాంతమైన ఓ బీచ్కు దగ్గర్లో కొన్ని పాత కాలపు విల్లాను కొనుగోలు చేయాలనుకుంటున్నారట. అంతేకాదు, యూరప్లోనూ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భారీగా పెట్టుబడలు పెట్టాలని .. అత్యంత ఖరీదైన ప్రాపర్టీలను కొనుగోలు చేయాలని సన్నాహాలు చేస్తున్నట్టు ఫిలిం సర్కిల్స్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలీదు గానీ, నెట్టింట ఈ వార్త వైరల్గా మారింది. కాగా, ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. అలాగే, సలార్, ప్రాజెక్ట్ కె సెట్స్ మీదున్నాయి. ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ను జరుపుకుంటోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!