ప్రమోషన్.. పదోన్నతి.. జీవితంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు కోరుకునే సాధారణ కోరిక. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు.. దీనికోసం పెద్దలు ఆధ్యాత్మికంగా చెప్పిన విషయం తెలుసుకుందాం…
ప్రతి ఒక్కరు ఉద్యోగ జీవితంలో స్థిరత్వం కోసం అభద్రతా భావం తొలగించు కోవాలంటే తప్పకుండా శనీశ్వరుడిని “ఓం చర స్థిర స్వభవాయ నమః” అనే మంత్రంతో పూజించాలి. ఈ మంత్రాన్ని వీలయినన్ని సార్లు శనివారం రోజున జపిస్తూ ఉండాలి. సంధ్యా సమయంలో రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి, రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేయాలి. దీనితో పాటు హనుమంతుని విగ్రహానికి లేదా చిత్రపటానికి నువ్వుల నూనె. సింధూరం కలిపి పటానికి కానీ విగ్రహానికి కానీ లేపనం వేయాలి. ఆవనూనెతో శివాలయంలో, కాలభైరవ ఆలయంలో దీపం వెలిగించినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది.