Radhasaptami : ఆరోగ్య సంబంధమైన
రథసప్తమి రోజున ప్రసరించే సూర్యకిరణాలు, అనేక రకాల ఔషధ గుణాలు కలిగి ఉండి జిల్లేడును విశేషమైన రీతిలో ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ రోజున జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేయడం వలన వివిధ రకాల వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని వైద్యశాస్త్రం తెలియచేస్తుంది. ఈ విధంగా సూర్యుడిని ఆరాధించడం వలన ఆధ్యాత్మిక పరమైన పుణ్యం తో పాటు ఆరోగ్య సంబంధమైన ప్రయోజనాలు కలుగుతాయి అని ప్రాచీన గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.రథసప్తమి కి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి రథసప్తమి రోజు ఉదయం సూర్యోదయానికి ముందుగా నిద్ర లేచి స్నానం చెయ్యాలి . స్నానం చేసేటప్పుడు పురుషులు 7 జిల్లేడు ఆకులు, స్త్రీలు 7 చిక్కుడు ఆకులు తలపై,భుజాలపై ఉంచుకుని ఈ కింద మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి.
. ఆ సమయంలో నీటి తో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనల్ని సిద్ధం చేసి అనేక చర్మ రోగాల నుండి రక్షణ కలిగిస్తుంది.
Radhasaptami : చదవాలిసిన మంత్రం :
జననీ త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే,
సప్తమ్యా హ్యదితే దేవి సమస్తే సూర్యమాతృకే ”
అనే మంత్రం చెప్పుకుంటూ స్నానం చేయాలి..
శ్రీ రామ చంద్రులంతటి వారే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసి మరి రావణవథకు బయలుదేరారట.
సూర్యునికి ఇష్టమైన ఈ రోజున పై మంత్రాన్ని పఠించి సూర్యుని పూజించి ఆర్ఘ్యం ఇచ్చి మన భక్తి ప్రపత్తుల తో కృతజ్ఞతలు తెలియచేద్దాం.
కృతజ్ఞతలు తెలుపుకొండి
ఆ రోజు అందరం భక్తితో ” ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః ” అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం. ఎన్ని సార్లు ఆయనను స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ ప్రత్యక్ష దైవం.కాబట్టి ప్రతి ఒక్కరు రథ సప్తమి ని ఆచరించి ,మన జీవనానికి ఎన్నో విధాల సహాయ పడుతూ ,ఆవిశ్రాంతం గా ముందుకు సాగిపోతున్న ఆ ప్రత్యక్ష దైవానికి ఎవరికి తగినట్టు వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుకొండి . సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత ,ఐశ్వర్యా ప్రదాత కాబట్టి భక్తి తో స్మరించండి.