ఇంద్రకీలాద్రిపై అమ్మవారు కనకవర్ణ శోభితురాలై వుండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే పేరు వచ్చింది. అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా ఆషాడ మాసంలో శాకాంబరీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి . శాకంబరి ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ ఉత్సవాలు మూడు రోజులు పాటు ఎంతో ఘనంగా జరుపుతారు.
కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో శాకంబరి ఉత్సవాలను పరిమిత కూరగాయలతోనే ఆలయ ప్రాంగణాన్ని అలంకరిస్తారు . మొదటి రెండు రోజులు అంతరాలయంలో సాధారణ అలంకరణ, చివరి రోజు ముఖమండపం నుంచి ధ్వజస్తంభం వరకు కూరగాయలను అలంకరిస్తారు. చివరి రోజు ఉదయం 11 గంటలకు నిర్వహించే పూర్ణాహుతీతో శాకాంబరీ ఉత్సవాలు ముగుస్తాయి.. జ్యేష్ఠ మాసం తరువాత వచ్చే ఆషాఢ మాసంలో జగన్మాతను శాకంబరీదేవిగా పూజించడం ఆచారం. శాకములు అంటే కూరగాయలు. వివిధ కూరగాయలతో అలంకరించి పూజిస్తాము కనుక ఈ తల్లిని శాకంబరీ దేవి అంటాము.
అమ్మవారు శాకాంబరీ దేవిగా అవతరించడానికి కారణము ఇదే.. దుర్గమాసురుడనె ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని కొసం కొన్ని వందల సంవత్సరాల తపస్సు చేశాడు.బ్రహ్మ ప్రీతిపొంది ప్రత్యక్షం అయ్యి వరం కోరుకోమనగా ,వేదాలను అందరు మర్చిపొవాలని,వేద జ్ఞానం అంతా తనకే రావలని వరం అడిగాడు.అతి తక్కువ కాలంలొనే అందరు వేదాలను మర్చిపొయారు.యజ్ఞ, యాగాదులు లేక దేవతలకు పూజలు లేవు ,తత్ఫలితంగా వర్షాలు కురవడంలేదు.ప్రపంచమంత కరువు సంభవించింది.అది చూసిన ఋషులు చలించిపొయారు.చివరకు ఋషులు అందరు “సుమేరు పర్వతం”గుహలలోకి వెళ్ళి ఆ జగన్మాతను “అమ్మా!అమ్మా!” అంటూ వేడుకున్నారు.వారి ప్రార్ధన ఆ తల్లి విని వారి ఎదుట ప్రత్యక్షం అయ్యింది.శరీరం అంత నీలివర్ణంతొ అనేకమైన నయనాల తో “శతాక్షి”అనే నామంతొ చతుర్భుజములుతొ కనిపించింది. ధనుర్బణాలతొ ఉన్న ఆ తల్లి ఈ దుర్గతిని చూసి 9 రోజులపాటు కన్నుల నీరు కారుస్తూ ఏడ్వసాగింది.ఆమె కన్నిటితొ ఈ అన్ని నదులు నిండిపొయాయి.ఇక వారి దుస్థితిని చూడలేక అమ్మ శాకంబరిగా అవతరించింది.అమ్మ శరీరభాగాలను కూరలను,పండ్లను,గింజలను,గడ్డి మొదలైనవి గా చేసి ,తన శరీరభాగలను అంటే శాకములను అన్ని జీవములకు ఇచ్చింది. ఆ రాక్షసుడును చంపి అమ్మవారు శాకంబరీదేవిగా ఆవిర్భవించి జనుల ఆకలిని తీర్చింది ఆషాఢమాసంలోనే. అందుకే ఆషాఢమాసంలో దేవీక్షేత్రాలలో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరిస్తారు.