సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో ఇది 28వ సినిమా.. ఈ మూవీలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపింబోతున్నారు. త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాకు మార్కెట్లో కూడా ఫుల్ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.. నిర్మాతలు ఇప్పటికే బిజినెస్ కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు నిర్మాతలు ఎంత మేరకు కోట్ చేస్తున్నారంటే..
ఈ సినిమాకు ఓవర్ సీస్ రైట్స్ కోసం 23 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.. దీంతో పాటు సౌత్ లోని నాలుగు రాష్ట్రాల డిజిటల్ రైట్స్ కోసం రూ.100 కోట్ల వరకు కోట్ చేసినట్లు సమచారం.. అందుకోసం ప్రముఖ ఓటీటీ సంస్థల ప్రతినిధులతో చర్చలు కూడా జరుగుతున్నాయట.. ప్రస్తుతానికి హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్ కి సంబంధించి బేరాలు నడిపించడం లేదని తెలిసిందే. ఇక్కడ ఓ 30 కోట్లు పలకవచ్చని తెలుస్తోంది.. ఆడియో రైట్స్ కి రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.
ఇక థియేటర్ హక్కుల విషయానికి వస్తే.. నైజాంలో సినిమా హక్కులు రూ.45 కోట్ల పలుకుతున్నాయట. ఆంధ్రలో రూ.50 కోట్లు, సీడెడ్ లో రూ.20 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. థియేట్రికల్ రైట్స్ మీద రూ.140 కోట్లు, నాన్ థియేట్రికల్ రైట్స్ మీద రూ.140 కోట్లు.. మొత్తంగా రూ.250 నుంచి రూ.280 కోట్ల బిజినెస్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.. మరీ ఆ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో లేదా చూడాలి.
ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నరట.. ఒకవేళ అదే జరిగితే మహేష్ బాబు మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే అవుతుంది. ఇక ఈ సినిమాకు ‘పార్థు’, ‘అర్జునుడు’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట.. ‘అ’ అనే అక్షరం త్రివిక్రమ్ కి సెంటిమెంట్ అట.. అందుకే ఈ సినిమాకు కూడా ‘అర్జునుడు’ టైటిల్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను 2023, ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది.. గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. 11 సంవత్సరాల తర్వాత వీరి కాంబోలో సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. మరోవైపు ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’ వరుస హిట్ సినిమాల తర్వాత ఇప్పుడు మహేష్ బాబుతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారు. ఈ సినిమాను కూడా హారికా హాసిని బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. మహేష్ కి అంకుల పాత్రలో నటించబోతున్నారని టాక్. ఆయన క్యారెక్టర్ ని చాలా భిన్నంగా డిజైన్ చేస్తున్నారట త్రివిక్రమ్.. మహేష్, మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా బాగుంటాయని మూవీ యూనిట్ చెబుతోంది..
అంతేకాదు ఈ సినిమాలో అలనాటి అగ్ర హీరోయిన్ శోభన కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.. గతంలో త్రివిక్రమ్.. నదియా, ఖుష్బు వంటి సీనియర్ హీరోయిన్స్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈకోవలోనే శోభనను కూడా ఈ సినిమా కోసం ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే మోహన్ బాబు, శోభన నటించబోయే దాని గురించి మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా పనిచేయనున్నారు. త్రివిక్రమ్ తో సినిమా తర్వాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేయనున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!