Naveen polishetty : నవీన్ పోలిశెట్టి..టాలీవుడ్ లో ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. డెబ్యూ సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో తెలుగులో హీరోగా పరిచయమయ్యాడు. టాలెంటెడ్ యాక్టర్ అని అందరితోను అనిపించుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో.. ఆ తర్వాత ‘చిచోరె’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టి.. అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక తెలుగులో వచ్చిన రెండో సినిమా ‘జాతిరత్నాలు’ .
ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కరోనా సమయంలోనూ ఊహించని సక్సెస్ అందుకొని సెన్సేషన్ సృష్టించాడు. ఇక ఈ సినిమా వచ్చి నాలుగు నెలలు దాటిపోవడంతో పోలిశెట్టి నెక్స్ట్ సినిమా గురించి ఆసక్తి అందరిలో ఎక్కువైంది. కాగా తాజాగా నవీన్ పొలిశెట్టి ట్విట్టర్ వేదికగా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై సాలీడ్ అప్డేట్ ఇచ్చాడు. ఓ అభిమాని ట్విట్టర్ లో ఈ హీరో పర్ఫార్మెన్స్ ను సూపర్ అని మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. దీనిపై పోలిశెట్టి స్పందిస్తూ.. తనదైన స్టైల్ లో ఫన్నీగా ట్వీట్ చేస్తూ ఇప్పటికే మూడు సినిమాలు లైన్ లో ఉన్నట్లు పేర్కొన్నాడు.
Naveen polishetty : పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ తో కలసి పనిచేయడం ఒక డ్రీం.
నవీన్ “థ్యాంక్యూ సో మచ్. నా నెక్స్ట్ మూడు సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్స్ ని త్వరలో వాటిని ప్రకటిస్తాను. ‘ఇంకెక్కడ ఏది చదివినా నమ్మకండి’ – ఆల్బర్ట్ ఐన్ స్టీన్. పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ తో కలసి పనిచేయడం ఒక డ్రీం. మీ కోసం స్టోర్ లో ఉంచిన వాటి గురించి చెప్పడానికి ఎంతో ఆతృతగా ఎఉన్నాను” అని నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు. నవీన్ చెప్పిన పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ లు యూవీ క్రియేషన్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, వైజయంతీ మూవీస్ సంస్థలని అనిఅభిమానులు చెప్పుకుంటున్నారు. యూవీ బ్యానర్ లో అనుష్క శెట్టి – నవీన్ ప్రధాన పాత్రలతో ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమా నిర్మించనున్నట్టు టాక్ వినిపిస్తోంది.