Guntur Kaaram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన “గుంటూరు కారం” జనవరి 12వ తారీకు రిలీజ్ కాబోతోంది. మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు సాంగ్స్ విడుదల చేయడం జరిగింది. మూడో సాంగ్ గా విడుదలైన “కుర్చీ మడతపెట్టి” యూట్యూబ్ నీ షేక్ చేసి పడేసింది. మహేష్ మాస్ స్టెప్స్ ఫ్యాన్స్ నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా వుండగా “గుంటూరు కారం” తర్వాత మల్టీస్టార్ సినిమా చేయడానికి త్రివిక్రమ్ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
విక్టరీ వెంకటేష్ మరియు నాని ఇద్దరు కలిసి ఈ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆల్రెడీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా కన్ఫర్మ్ అయింది. కానీ అల్లు అర్జున్ సినిమా కంటే ముందుగానే వెంకటేష్ నానీల మల్టీస్టారర్ ప్రాజెక్ట్ పట్టా లేకబోతున్నట్లు సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ తో త్రివిక్రమ్ ఈ సినిమా చిత్రీకరించనున్నారట. మొన్నటి వరకు నాణ్యత సినిమా ఉందని గట్టిగానే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో వెంకటేష్ కూడా జాయిన్ అయినట్లు న్యూస్ రావడం సంచలనంగా మారింది. గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాలు వెంకటేష్ తో త్రివిక్రమ్ చేయడం జరిగింది.
వీరి కాంబినేషన్ లో మరో సినిమా కోసం సినీ ప్రేమికులు ఎప్పటి నుంచొ ఎదురుచూస్తున్నారు. ఇటీవల త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి తను రెడీ గానే ఉన్నట్లు వెంకటేష్ స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రమంలో వెంకటేష్, నాని వంటి స్టార్ హీరోలతో త్రివిక్రమ్ మల్టీ స్టారర్ చేయడానికి రెడీ అవుతున్నట్లు వచ్చిన వార్త ఇండస్ట్రీలో చర్చనీయంసంగా మారింది. “గుంటూరు కారం” జనవరి 12వ తారీకు రిలీజ్ కానుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6వ తేది నిర్వహించనున్నారని సమాచారం. ఆ తర్వాత ఫిబ్రవరిలో వెంకటేష్, నాని మల్టీస్టారర్ సినిమా పట్టలేకుతోందని సమాచారం.