Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ సగం కంటే ఎక్కువ పూర్తయిపోయింది. ఇంకా నెలరోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. హౌస్ లో ఇప్పటివరకు ఎవరు అంచనా వేయని రీతిలో రకరకాల ట్విస్ట్ లతో చూసే ఆడియన్స్ తో పాటు హౌస్ లో ఆడుతున్న ప్రేక్షకులకు ఊహించని షాక్ లు ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం హౌస్ లో 12 మంది ఉన్నారు. శివాజీ, గౌతమ్, ప్రశాంత్, అశ్విని మినహా మిగతా వాళ్లంతా నామినేషన్స్ ఉండటం జరిగింది. మొత్తం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉండగా శోభా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు బాగా ప్రచారం జరిగింది. వాస్తవానికి ఆమె గత వారమే ఎలిమినేట్ అవుతుందని అందరూ అంచనా వేశారు.
కానీ బిగ్ బాస్ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఆట సందిప్ నీ ఇంటికి పంపించడం జరిగింది. ఈసారి కూడా అదే రీతిలో బిగ్ బాస్ వ్యవహరించినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా శోభ మేనేజ్మెంట్ కోటకి సంబంధించిన కంటెస్టెంట్ అని బాగా ప్రచారం జరుగుతుంది. అందువల్లే హౌస్ లో ఆమె ఇతర కంటెస్టెంట్లపై రెచ్చిపోతుందని బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసి మరి గేమ్ ఆడుతుంది అంటున్నారు. ఇదిలా ఉంటే తొమ్మిదో వారంలో కూడా శోభ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్న ఆమెకు బదులు.. మరో కంటెస్టెంట్ శోభ జిగ్రీ దోస్త్ తేజనీ బలి చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
విషయంలోకి వెళ్తే 9వ వారంలో టేస్టింగ్ తేజ ఎలిమినేట్ కావడం జరిగిందంట. హౌస్ లో తేజ అద్భుతమైన కామెడీ టైమింగ్ తో పాటు అందరిని అలరించే రీతిలో స్టార్టింగ్ నుండి గేమ్ ఆడటం జరిగింది. కంటెస్టెంట్ శోభకి చాలా దగ్గర అయ్యాడు. కానీ తొమ్మిదో వారంలో అతని ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో వారానికి రెండు లక్షల రూపాయల చొప్పున టేస్టీ తేజకు మొత్తంగా 18 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం.