Arjun Reddy: 2017లో “అర్జున్ రెడ్డి” సినిమా విడుదలయ్యింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో హీరో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లోనే స్టార్ డామ్ సంపాదించాడు. ఈ సినిమా స్టోరీ..ఫుల్ టెంపర్ కలిగిన మెడికల్ స్టూడెంట్.. కోపాన్ని అనుచుకోలేక తీసుకున్న నిర్ణయాలు బట్టి ప్రేయసిని కోల్పోవడం.. మళ్లీ కలవటం. సినిమాలో హీరోయిజం ఓ రేంజ్ లో చూపించడం జరిగింది. అప్పట్లో ఈ సినిమా విజయం సాధించిన సమయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు… ఇండస్ట్రీలో మారుమ్రోగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటివారు.. ఓపెన్ గానే సందీప్ తో సినిమా చేస్తామని ప్రకటనలు చేశారు.
ఇక ఇదే సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలో “కబీర్ సింగ్” గా రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవటం జరిగింది. ఇటీవల రణబీర్ కపూర్ తో “యానిమల్” చేసి మరో హిట్ అందుకున్నారు. కెరియర్ స్టార్ట్ చేసి మూడు భారీ బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ విజయాలు సందీప్ రెడ్డి వంగా సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ పాల్గొనడం జరిగింది. “అర్జున్ రెడ్డి” సినిమా స్టోరీ మొదట మెగా హీరో అల్లు అర్జున్ కి చెప్పినట్లు కొత్త విషయాన్ని బయటపెట్టారు. “అర్జున్ రెడ్డి” సినిమా కంటే ముందే 2011వ సంవత్సరంలో బన్నీకి ఒక కథ వినిపించడం జరిగింది. అయితే అది కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత “అర్జున్ రెడ్డి” స్టోరీ వినిపించ కానీ కుదరలేదు.
ప్రస్తుతం ప్రభాస్ తో “స్పిరిట్” సినిమా చేయబోతున్న. “స్పిరిట్” అయిన వెంటనే అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్ అయిందని సందీప్ రెడ్డి వంగా స్పష్టం చేశారు. స్పిరిట్ సినిమా సెప్టెంబర్ నెలలో షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూసుకుంటే వచ్చే ఏడాదిలో సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సో వచ్చే ఏడాదిలో అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ సినిమా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే డైరెక్టర్ త్రివిక్రమ్ లేదా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఆ తరువాత సంగీప రెడ్డి వంగా సినిమా బన్నీ చేయనున్నారు.