Sindhu Menon: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన అద్భుత చిత్రాల్లో చందమామ ఒకటి. ఈ చిత్రంలో శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా నటిస్తే.. కాజల్ అగర్వాల్ సింధు మీనన్ హీరోయిన్లుగా చేశారు. కాజల్ కు ఇది రెండో సినిమా. 2007లో విడుదలైన చందమామ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ మూవీ తర్వాత కాజల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ హోదా అందుకుని కెరీర్ ను పరుగులు పెట్టించింది. కానీ ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్గా నటించిన సింధు మీనన్ మాత్రం కొంత కాలానికి ఇండస్ట్రీకి దూరమైంది.
కెరీర్ పీక్స్ లో ఉండగానే సింధు మీనన్ యాక్టింగ్ ఎందుకు మానేసింది..? అసలు ఆమె ఏమైపోయింది..? ఇప్పుడెక్కడ ఉంది… వంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బెంగుళూరు లోని ఓ మళయాలీ కుటుంబంలో సింధు మీనన్.. డ్యాన్స్ పై ఉన్న మక్కువతో చిన్నతనం నుంచి భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. అనేక పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. అయితే ఓ నాట్య పోటీలో సింధు మీనన్ను చూసిన భాస్కర్ హెగ్డే ఆమెకు రష్మీ అనే కన్నడ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం ఇప్పించారు.
అలా 13 ఏళ్ల వయసులోనే సింధు సినీ గడప తొక్కుంది. 1994లో విడుదలైన రష్మీ మూవీతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకుంది. 2001లో భద్రాచలం మూవీతో సింధూ టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆపై త్రినేత్రం, శ్రీరామ చంద్రులు, ఆడంటే అదో రకం, చందమామ తదితర చిత్రాల్లో నటించింది. ప్రధానంగా కన్నడ, మలయాళ భాషల్లో సింధు మీనన్ సినిమాలు చేసింది.
అయితే వరుస చిత్రాలతో నటిగా బిజీగా ఉన్న సమయంలోనే సింధు మీనన్ పెళ్లి పీటలెక్కింది. 2010లో తమిళనాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్ డొమినిక్ ప్రభురి వివాహం చేసుకుంది. వివాహం అనంతరం భర్త కోరిక మేరకు యాక్టింగ్ కు గుడ్ బై చెప్పింది. భర్తతో యూకేలో సెటిల్ అయింది. ప్రభు, సింధు మీనన్ దంపతులకు ఒక కుమార్తె మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం సింధు ఫ్యామిలీతో లండన్ లో హ్యాపీ లైఫ్ను లీడ్ చేస్తోంది. వివాహం అనంతరం సినిమాలకు దూరమైనా కూడా సోషల్ మీడియాలో మాత్రం సింధు చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!