Krishnamma Kalipindi Iddarini: అక్క ఈ ఒక్క బెల్లం గడ్డ వేస్తేనే బావగారి తూకం తూగుతుందా నీ పిచ్చి గాని అని అఖిల అంటుంది. ఈశ్వర్ బరువు అంత బెల్లం తెచ్చానే త్రాసు ఎందుకు తూగడం లేదు అని వాళ్ల అత్తయ్య అంటుంది.అక్క ఈ ఒక్కటి వేచి నువ్వు త్రాచు లేవకపోతే అవమానం పడే కన్నా వేయకుండా ఉండడమే బెటర్ అని అఖిల అంటుంది.గౌరీ అమ్మవారిని మనసులో తలుచుకొని అమ్మ నా భర్త మీద నాకున్న ప్రేమ నిజమైతే ఈ బెల్లం గడ్డతో త్రాసు తూగాలి అని మనసులో నమస్కరించి ఆ బెల్లం గడ్డ త్రాసులో వేస్తుంది అమ్మవారి అనుగ్రహంతో త్రాచు లేచింది గౌరీ అమ్మవారికి మనసులోనే నమస్కరించుకుంటుంది.పూజారి గారు అమ్మ మీది జన్మజన్మల బంధం రుక్మీని దేవి తులసిదళంతో కృష్ణుని తూగినట్టు నువ్వు ఆ ఒక్క బెల్లం ముక్కతో ఈశ్వర్ బాబుని త్రాసులో తూగావు మీది ఎప్పటికీ విడిపోలేని బంధం అని పూజారి గారు అంటాడు.
భగవంతుడు ఈ త్రాచును తూగి నాకు మోసం చేశాడు అని ఈశ్వర్ మనసులో అనుకుంటాడు.కట్ చేస్తే అందరూ గుడిలో నుంచి ఇంటికి వచ్చేస్తారు ఏరా మనవళ్ళు బాగా జరిగిందా అంతా ఓకేనా రండి రండి అంటూ వాళ్ళ తాతయ్య నాయనమ్మ లోపలికి తీసుకెళ్తారు.అందరూ లోపలికి వస్తుండగా ఉజ్వల ఆగండి అని హారతి తీసుకువచ్చి కొత్త జంటలకి హారతి ఇస్తుంది.గుడిలో నుంచి ఇంటికి వస్తున్నాం అక్కడ నరదిష్టి ఏమిటి అని సునంద అంటుంది.కీడేంచి మేలెంచమన్నారు కదా అందుకని నరదిష్టి పోవాలని హారతి తీస్తున్నాను కానీ ఈ పిల్ల ఏంటి ఇంటికి కోడలు అవ్వాలనుకొని ఉన్నది ఇప్పుడు సడన్గా ఇలా మారిపోయి హారతిస్తుంది అని ఆలోచిస్తున్నావు నీ చూపులో నాకు అది అర్థం అయింది అత్తయ్య కానీ మేము ఆస్తులన్నీ పోగొట్టుకొని రోడ్డు మీద పడ్డప్పుడు వీళ్లకు బాగా అయింది అని అనుకోకుండా మమ్మల్ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్నారు ఇంత గొప్ప వాళ్ళకి ద్రోహం చేయాలని చూస్తే అంతకన్నా నమ్మక ద్రోహం ఉండదు అని ఉజ్వల అంటుంది.
అవును వదిన గారు హనుమంతుడికి రాముడు ఎలా నమ్మినబంటులా ఉన్నాడు ఈ ఇంటికి మనం అలాగే ఉండాలి అమ్మ అని ఉజ్వల నాతో చెప్పింది అని సౌదామిని అంటుంది. ద్వేషం ఉన్నప్పుడు దూరం పెడతాం కోపం ఉన్నప్పుడు క్షమించి సరి చేసుకుంటాం నీ మీద ఉన్నది కోపమే కానీ ద్వేషం కాదమ్మా అని సునంద అంటుంది.అయినా మిమ్మల్ని దూరం పెట్టడానికి మేము వేరు మీరు వేరు కాదమ్మా మీ అమ్మ ఒంట్లో రక్తం నా ఒంట్లో రక్తం ఒకటే అని వాళ్ళ మామయ్య అంటాడు.
మీరు అలా మాట్లాడుతుంటే నా కంట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి మామయ్య అని ఉజ్వల హారతి ఇస్తూ మిమ్మల్ని సుఖంగా ఉంచడానికి కాదే మిమ్మల్ని తగలబెట్టడానికి అని మనసులో అంటుంది అఖిల ఆదిత్య గౌరీ ఈశ్వర్ బావతో ఒక ఆట ఆడిపించాలనుకుంటున్నాను అని ఉజ్వల అంటుంది.ఉజ్వల ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని ఈశ్వర్ అంటాడు.ఎందుకంటావ్ ఏంటి బావ భార్యాభర్తల మధ్య ఉన్న సిగ్గును వదిలేసి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని ఎవరెస్ట్ అంత పెంచడానికి అని ఉజ్వల అంటుంది.అవున్రా మనవడా కొత్తగా పెళ్లయిన వారి మధ్య ఆటలు పాటలు సరసాలు ఉండాలి రా అని వాళ్ళ తాతయ్య అంటాడు. అఖిల ఆదిత్య గౌరీ ఈశ్వర్ బావ రండి మీరిద్దరూ కూర్చోండి అని ఉజ్వల కూర్చోబెడుతుంది.
గౌరీనువ్వు నా పక్కన కూర్చుంటే నువ్వు చేసిన మోసమే నాకు గుర్తుకు వస్తుంది నా గుండె రగిలిపోతుంది అని ఈశ్వర్ మనసులో అనుకుంటాడు.ఆటలు అని పళ్ళు తెచ్చి ముంగట పెట్టావేంటమ్మా అని వాళ్ళ చిన్న అత్తయ్య అంటుంది.ఈ పళ్ళు తెచ్చి పెట్టింది ఒకరికొకరు తినిపించుకోవడం కోసం అని ఉజ్వల అంటుంది.ఉజ్వల ఇప్పుడు ఇవన్నీ ఏంటి ఆపేసేయ్ నాకు చిరాగ్గా ఉంది అని ఈశ్వర్ అంటాడు.అదేంటి బావా అలా అంటావు భార్యాభర్తలు అన్నప్పుడు ఇలాంటి ఆటలు ఆడుకోవాలి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎంత ఉందో తెలుసుకోవాలి కదా అని ఉజ్వల అంటుంది.ఆ విషయం అందరికీ తెలుసు కదా మళ్లీ కొత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏముంది అని ఈశ్వర్ అంటాడు.ఈ ఆటల ద్వారా ఇల్లంతా సంతోషంగా నిండిపోతుంది మీ భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది అని వాళ్ళ అమ్మ అంటుంది.దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మళ్ళీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం