Malli Nindu Jabili April 18 2024 Episode 626: రావణాసురుడి అంతం ఈ రాముల వారి గుడి నుంచే మొదలవుతుంది గెట్ రెడీ గౌతమ్ ఇ సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా నీ పని అయిపోతుంది అని అరవింద్ అంటాడు. అధికారవింద్ అని గౌతమ్ చెప్పబోతూ ఉండగా నువ్వేం చెప్పినా నేను వినిపించుకో దలుచుకోలేదు గౌతమ్ పద అంటూ అరవింద్ వెళ్ళిపోతాడు.కళ్యాణం అయిపోయేలోగా నా పని అయిపోతుందన్నాడు అసలు అరవింద్ ఏం చేయబోతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు గౌతమ్. అయిపోయాయా మీ కబుర్లు అని మాలిని అంటుంది.చానా క్లుప్తంగా పైపైన మాట్లాడుకున్నాం మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారని త్వరగా వచ్చేసాను అని అరవింద్ అంటాడు. గౌతమ్ కూడా అక్కడికి వచ్చి మల్లి పక్కన నిల్చుంటాడు.
అరవింద్ బాబు గారు ఏది చెప్పినా నీ మంచి కోసమే చెబుతారు అని మల్లి అంటుంది.పంతులుగారు పూజకు టైం అయితుంది మొదలు పెట్టండి అని శరత్ అంటాడు.కళ్యాణంజరిపించేవారు పీటల మీద కూర్చోండి అని పంతులుగారు అంటారు. మాలిని అరవింద్ పీటల మీద కూర్చుంటారు. పంతులుగారు వాళ్ళకి కంకణాలు ఇస్తే అరవింద్ కి మాలిని కడుతుంది మాలినికి అరవింద్ కడతాడు. అరవింద్ ఏం చేయబోతున్నాడు అసలు ఊహ కూడా అందడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు గౌతమ్. నేను ఏం చేయబోతున్నానని టెన్షన్ పడుతున్నావ్ కదూ గౌతమ్ అని అనుకుంటాడు అరవింద్. పంతులుగారు సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటారు అందరూ నమస్కారం చేసి కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉంటారు. ఇంతలో గౌతమ్ కి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ కొత్త నెంబర్ నుంచి వచ్చిందని గౌతమ్ ఎత్తుతాడు అతను హలో హలో అంటూ ఉండగా గౌతమ్ లేచి పక్కకు వెళ్తాడు.
కళ్యాణం జరుగుతూ ఉండగా వెళ్లిపోకూడదండి అని మల్లి అంటున్న వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, గౌతమ్ ఒకచోట నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఫోన్ కట్ అవ్వడంతో ఎవరిది నెంబర్ అని మళ్ళీ గౌతమ్ ఫోన్ చేస్తాడు. ఇంతలో తన తల మీద నుంచి గంట ఉడికిందా పడుతుంది. ఇలా ఎప్పుడు గంట కింద పడలేదు ఇలా ఎందుకు జరిగింది అని గుడికి వచ్చిన అతను అంటాడు. ఎవరో కావాలనే గుడిగంటను లూజ్ చేసినట్టున్నారు లేకుంటే ఇలా జరగదు అని ఒక ఆవిడ అంటుంది. ఈ గంట మామూలుగా పడిపోయిందా లేదంటే అరవింద్ ప్లాన్ చేశాడా అని గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు. మల్లి గౌతమ్ ఇంకా రాలేదు వెళ్లి తీసుకురా అని అరవింద్ అంటాడు.
ముందు కళ్యాణం జరిపించండి అరవింద్ గౌతమ్ వస్తాడులే అని వసుంధర అంటుంది. కళ్యాణం తను కూడా చూడాలి కదా అత్తయ్య తను కూడా మన ఫ్యామిలీ నెంబర్ ఏ కదా అని అరవింద్ అంటాడు. మీ ఫ్యామిలీ నెంబర్ నుంచి మమ్మల్ని ఎప్పుడో డిలీట్ చేసింది వసుంధర అని కౌసల్య అంటుంది.అలా ఎప్పుడూ అనుకోకండి అమ్మ అని అరవింద్ అంటాడు.మళ్లీ నార్మల్ గా వెళ్లి పూజలో కూర్చుంటాడు గౌతమ్.మల్లి మీ ఆయనని కళ్యాణం అయిపోయేంత వరకు ఎక్కడికి వెళ్ళనివ్వకు అని అరవింద్ అంటాడు. ఆయన ఎక్కడికి వెళ్తానన్నా నేను వెళ్ళను బాబు గారు అని మల్లి అంటుంది. సీతారాముల కళ్యాణం జరిపిస్తారు పంతులుగారు.కళ్యాణం అయిపోయిన తర్వాత పంతులుగారు హారతి ఇస్తాడు. అందరూ హారతిని కళ్ళకు హద్దుకుంటారు. పంతులుగారు అందరికీ ప్రసాదం పెడతాడు. అందరూ ప్రసాదని స్వీకరిస్తాడు కానీ గౌతమ్ తినకపోవడంతో తిను గౌతమ్ అని అరవింద్ అంటాడు.
గౌతమ్ మింగలేక కక్కలేక అన్నట్టుగా ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. అందరికీ పానకాన్ని పోసి ఇస్తాడు పంతులుగారు.పంతులుగారు సీతారాముల కళ్యాణం అయిపోయినట్టేనా మేము అలా ప్రదక్షిణచేసేస్తాం పద మల్లి అని వసుంధర అంటుంది. నేనెందుకులెండమ్మా మీరు వెళ్లి చేసి రండి అని మల్లి అంటుంది. నాకు తోడుగా రా మల్లి అని వసుంధర అనడంతో మల్లి చేసేదేమీ లేక తన వెంట వెళ్తుంది. కట్ చేస్తే, ప్రదక్షణక అని చెప్పి పక్కకు తీసుకొచ్చారు ఏంటమ్మా గారు మీరు ప్రదక్షణ అనగానే నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారని అర్థమైంది అనే మల్లి అంటుంది. నువ్వు చాలా తెలివైన దానివి కదా మల్లి అందుకే నీకు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ నేను చెప్పేది జీవితాంతం గుర్తు పెట్టుకో అరవింద్ దగ్గర మీ అక్క దగ్గర వాళ్లకోసం కళ్యాణం జరిపిస్తున్నానని మొక్కుకున్నానన్నావు వాళ్ల దగ్గర మార్కులు కొట్టడం కోసం ఇకమీదట ఇలాంటి ప్రయత్నాలు చేయకు ఇలాంటి మొక్కులు మొక్కకు అని వసుంధర అంటుంది.
మాలిని అక్క బాగుండాలని నేను ఈ కళ్యాణం జరిపిస్తానని మొక్కుకున్నాను. ఇందులో స్వార్థం ఏమీ లేదు ఈ విషయం మీకు ఎప్పటికి అర్థమవుతుందో నేను పూజ చేసి సీతారాముల మీద ఒట్టు నాకు ఎప్పటికీ అలాంటి ఆలోచన లేదు అని మల్లి అంటుంది. మల్లి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో మన రెండు కుటుంబాలు దూరంగా ఉంటే మంచిది అని వసుంధర అంటుంది. నీ కూతురి మాంగల్యాన్ని కాపాడినందుకు వేరొక తల్లి అయితే నా మీద పూల వర్షం కురిపించి నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది మీరు మాత్రం కనీసం మనిషిగా కూడా చూడడం లేదు అని మల్లి అంటుంది. నేను చెప్పాల్సింది చెప్పాను ఇకమీదట నీ ఇష్టం అంటూ వసుంధర వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, అమ్మ సీతారాముల కళ్యాణం జరిపించిన వారు వారికోసం మొక్కుకున్నా వారు అందరూ క్షేమంగా ఉంటారు భార్యాభర్తలు సీతారాముల లాగా ఆనందంగా ఉండాలి అందుకే వాళ్ళు ఆదర్శ దంపతులయ్యారు మీరందరూ పిల్లాపాపలతో సంతోషంగా ఉండండి అని పంతులుగారు ఆశీర్వదిస్తారు. తాను జారీ కింద పడటంతో అబార్షన్ అయింది కాబట్టి తల్లి అయ్యే అవకాశం లేదని మాలిని అని బాధపడుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!