Malli Nindu Jabili April 20 2024 Episode 628: నిన్ను మంచి ప్లేస్ కి డిన్నర్ తీసుకువెళ్తాను అని అరవింద్ మల్లి కి ఫోన్ చేసి మల్లి ఎలా ఉన్నావ్? మీ ఇంటికి డిన్నర్ కు రావచ్చా అని అడుగుతాడు. అదేంటి బాబు గారు అలా అంటారు మిమ్మల్ని నేనే ఏదో ఒక రోజు భోజనానికి పిలుద్దాం అనుకున్నాను మీరే వస్తాను అంటున్నారు త్వరగా వచ్చేయండి నేను ఆయనకి ఫోన్ చేసి చికెన్ తీసుకురమ్మంటాను అని మల్లి అంటుంది. గౌతమ్ కూడా మా పక్కనే ఉన్నాడు మల్లి దారిలో కనిపిస్తే తీసుకువెళ్లాను అని అరవింద్ చెబుతాడు.సరే బాబు గారు మీకు ఇష్టమైనవన్నీ వండుతాను త్వరగా వచ్చేయండి అని మల్లి అంటుంది.కట్ చేస్తే,నీలిమ నువ్వు బజారుకు వెళ్లి పది రూపాయలు కోతిమీర పది రూపాయల పుదీనా కూల్ డ్రింక్స్ బాటిల్ తీసుకొని రా అని చెబుతుంది మల్లి.
అవన్నీ ఎందుకే తిండి దెయ్యం పట్టిందా అని కౌసల్య అంటుంది. అరవింద్ బాబు వాళ్లు మన ఇంటికి భోజనానికి వస్తున్నారా అత్తయ్య అని మల్లి అంటుంది. మన ఇంటికి భోజనానికి రావడంఏంటి ముందు గౌతమ్ కి విషయం చెప్పు అని కౌసల్య అంటుంది. ఆయన కూడా వాళ్లతోటే ఉన్నారంట అత్తయ్య అని మల్లి అంటుంది. వాడు వాళ్లతో ఉండడమేంటి అని కౌసల్య అనుకుంటుంది. వాళ్లని రావద్దని చెప్పు అని కౌసల్ అంటుంది. నోరు తెరిచి భోజనానికి వస్తానన్నాక వద్దని ఎలా అంటాను అని మల్లి అంటుంది. అమ్మ వదిన మాట ఇచ్చేసింది వద్దంటే బాగోదు అని నీలిమా అంటుంది. నా మనసుకు ఏదో కీడు జరుగుతున్నట్టు అనిపిస్తుంది అని కౌసల్య అనుకుంటూ ఉండగా వసుంధర ఫోన్ చేస్తుంది.
వదిన మల్లి ఎలా ఉంది నా కూతురు నా అల్లుడు ఇంటికి వస్తున్నాడని హడావుడి చేస్తుందా ఆ పల్లెటూరి నీ కోడలు అని వసుంధర అంటుంది. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అని కౌసల్య అంటుంది. రేపు మనిద్దరం కలుద్దాం వదిన అని వసుంధర అంటుంది. ఫోన్లో చెప్పు నేను నిన్ను కలవను అని కౌసల్య అనడంతో ఫోన్లో చెప్పే విషయం కాదు వదిన మనిద్దరం పర్సనల్గా కలవాలి ఈ విషయం ఎవరికీ చెప్పకు అని వసుంధర ఫోన్ కట్ చేస్తుంది. కౌసల్య ఆలోచనలో పడుతుంది.కట్ చేస్తే,నన్ను క్షమించు గౌతమ్ అరవింద్ ని నువ్వే చంపావని నోటికి వచ్చినట్టు అన్నాను సారీ అని మాలిని అంటుంది.పర్వాలేదులే మాలిని ఇప్పుడు అరవింద్ చెప్పాడు కదా పోలీసుల ముందు చెప్పాడు అందరి ముందు చెప్పాడు ఇంకోసారి అరవింద్ చెప్పినా నువ్వు నమ్మకు అని గౌతమ్ అంటాడు.
అయినా అరవింద్ అతనికి శిక్ష వేస్తానంటున్నాడు కదా అలాంటి వాడికి శిక్ష పడాల్సిందే అని మాలిని అంటుంది. నా భార్య నమ్మకాన్ని ఇలా వాడుకుంటున్నావా గౌతమ్ నీకు రోజుకు నరకం చూపిస్తాను. అని అరవింద్ అనుకుంటాడు. వచ్చేస్తే, మాలిని అరవింద్ గౌతమ్ ఇంటికి వస్తారు. రండి బాబు గారు మీకోసమే ఎదురు చూస్తున్నాను అని మల్లి అంటుంది. వంటలు ఎంతవరకు వచ్చాయి మల్లి అని అరవింద్ అంటాడు. ఐదు నిమిషాల్లో పూర్తయిపోతాయి బాబు గారు మీరు ఫ్రెష్ అప్ అయి రండి అని మల్లి అంటుంది. గౌతమ్ నువ్వు వీళ్ళతో ఎక్కడికి వెళ్లావు రా అని కౌసల్య అడుగుతుంది.
అమ్మ దారిలో కనిపిస్తే ముఖ్యమైన ప్లేస్ తీసుకు వెళ్లాను తర్వాత చెప్తాను అని అరవింద్ అంటాడు. మల్లి వంటలు సూపర్ గా వాసన వస్తున్నాయి వంట సంగతి చూద్దాం పద అంటూ అరవింద్ కిచెన్లోకి వెళ్తాడు. ఆ ఇంటికి ఈ ఇంటికి దూరం పెరగాలని ఎన్నిసార్లు చెప్పాను రా మల్లి మొహంలో ఆనందం చూడు ఎంతలా వెలిగిపోతుందో అది నాకు నచ్చలేదు అని కౌసల్య అంటుంది. అరవింద్ నన్ను క్షమించాడనే ఒకే ఒక కారణంతో మల్లి వాళ్ళకి అంత ఇంపార్టెంట్ ఇస్తుంది అని గౌతమ్ మనసులో అనుకుంటాడు. మల్లి గౌతమ్ కి పాయసం అంటే ఇష్టం కదా పాయసం కూడా చేస్తున్నావా కొన్ని మంచినీళ్లు తీసుకురా మల్లి అని బయటికి పంపిస్తాడు అరవింద్.
మల్లి బయటికి వెళ్ళగానే అందులో ఏదో కలుపుతాడు. మల్లి మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది. వంట పూర్తి అయిపోయింది బాబు గారు అందరూ రండి వడ్డిస్తాను అని మల్లి అంటుంది. గౌతమ్ ని కూడా పిలువు అని అరవింద్ అంటాడు. ఏవండీ మీ కోసమే అందరూ వెయిటింగ్ రండి అని మల్లి అంటుంది. గౌతమ్ కూడా వచ్చి అక్కడ కూర్చుంటాడు. మళ్లీ అందరికీ భోజనాలు వడ్డిస్తుంది. ఆంటీ ఇందాక గౌతమ్ ని ఎక్కడికి తీసుకు వెళ్లాను అని అడిగారు కదా నన్ను చంపిన స్పాట్ దగ్గరికి వెళ్ళాము అని అరవింద్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్