Madhuranagarilo April 20 2024 Episode 343: ఏంటి పెళ్లంటే పడని నువ్వు నిజం తెలుసుకోకుండా ఒక దొంగ కి డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయికి దొరకకుండా పంపించేస్తావా అని ప్రసాద్ రావు పక్కపక్క నవ్వుతాడు. మీరు అలా నవ్వకండి డాడ్ నాకు చాలా ఇన్సల్ట్ గా ఉంది అని వీరాజ్ అంటాడు. లేకపోతే ఏంట్రా ఆడవాళ్లు మగవాళ్ళని వేధించకు తింటారని నీకు నమ్మకం అందుకని ఒక అమ్మాయి తాళిబొట్టును దొంగ తీసుకొని పారిపోతుంటే పట్టుకోకుండా డబ్బులు ఇచ్చి పంపిస్తావా అని ప్రసాద్ రావు అంటాడు.బాబు గారు మీకు పెళ్లి అన్న ఆడవాళ్ళ అన్న ఎందుకు గిట్టరండి అని రాజి అడుగుతుంది. ఇంకోసారి ఎప్పుడూ నన్ను అలాంటి ప్రశ్న అడగకు అంటూ వీరాజ్ కోపంగా వెళ్ళిపోతాడు. ఎప్పుడు కోప్పడని బాబు గారు ఈరోజు ఎందుకు అంతలా కోపంగా ఉన్నారు అని రాజి అంటుంది.
వాడిని అడగకూడని ప్రశ్న అడిగితే కోపం రాదా అంటూ ప్రసాద్ రావు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, మధుర ఇంకా రాదా లేవలేదా ఇకమీదట నువ్వు కూడా పనికి వెళ్ళకు నా సంపాదన మీదనే కలోగంజో తాగుదాం అని ధనుంజయ్ అంటాడు. నైట్ అంతా ఏడుస్తూ అలసిపోయి పడుకుందండి అందుకే లేపలేదు అని మధుర అంటుంది. ధనుంజయ డ్యూటీ కి వెళ్తాడు. రాధా తెల్లవారిందని కంగారుగా లేస్తూ ఉండగా మధుర వచ్చి ఎందుకు రాదు అంత కంగారుపడుతూ లేస్తున్నావు నేనే లేపలేదు పడుకో అని అంటుంది. సారీ అత్తయ్య చూసుకోలేదు అని రాదా అంటుంది. కాఫీ తెస్తాను ఉండు అంటూ మధుర వెళుతుంది. కట్ చేస్తే, రుక్మిణి శ్యామ్ పండు ఇంట్లోకి వస్తూ ఉండగా దాక్షాయణి వాళ్ళకి హారతి ఇస్తుంది. ఇదే మన సామ్రాజ్యం ఈ కోటకు నువ్వు రాజువి నేను రానిని వీడు యువరాజ్ అని రుక్మిణి అంటుంది.
పండు ఇకమీదట నువ్వు ఆ స్కూల్ కి వెళ్లాల్సిన పని లేదు నేను పాత స్కూల్లోనే జాయిన్ చేస్తాను నీకు కొత్త బట్టలు కూడా తెచ్చాను ఇప్పుడు నీకు హ్యాపీ నేనా అని రుక్మిణి అంటుంది. అమ్మ కూడా ఉంటే సంతోషంగా ఉండేది అని పండు అంటాడు. అమ్మ ఎవర్రా అని రుక్మిణి అంటుంది. రాధమ్మ మా అమ్మ అని పండు అంటాడు.ఆరాధ మీ అమ్మ కాదని ఎన్నిసార్లు చెప్పాలి రా నేనే మీ అమ్మని నీ బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాను నీవు హాస్పిటల్ లో ఉంటే ఆపరేషన్ కి పాతిక లక్షలు ఖర్చు పెట్టాను నేనేరా నీ కన్నా తల్లిని కన్నతల్లి కంటే ఎవరు ఎక్కువ కాదు అని రుక్మిణి అంటుంది. కానీ రాధమ్మ నన్ను చిన్నప్పటినుంచి పెంచింది నాకు రాదమే కావాలి అని పండు అంటాడు. మీ అమ్మ రాధ కాదని ఎన్నిసార్లు చెప్పినా వినవే ఏంట్రా అని రుక్మిణి అంటుంది. చిన్న పిల్లాడు కథ అమ్మ పదిసార్లు చెప్తే వింటాడు అని దాక్షాయని అంటుంది.పిన్ని వీడికి కొత్త బట్టలు తెచ్చాను కదా తీసుకెళ్లి స్నానం చేయించి రెడీ చేయి స్కూల్ కి పంపిద్దాం అని రుక్మిణి అంటుంది.దాక్షాయిని చలపతి పండుని తీసుకొని వెళ్ళిపోతారు.
నాకు చాలా ఆనందంగా ఉంది శ్యామ్ అని రుక్మిణి శ్యామ్ భుజం మీద తలవలుస్తుంది. పక్క వాళ్ళ మనసును బాధపెట్టి నువ్వు సంతోషంగా ఉంటావు నువ్వు అసలు మనిషివేనా అంటూ శ్యామ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, రాధా పండు లేడని అనాధనైపోయానని ఏడుస్తుంది. మీకు మేమున్నాం రాదా అమ్మానాన్నలుగా మేము నీకు ఉన్నంత వరకు నువ్వు అనాధవి కావు అని మధుర అంటుంది. నా బలం బలహీనత ఆయన పండు అత్తయ్య వాళ్ళిద్దరూ లేని జీవితం నేను ఊహించుకోలేను అని రాదా కన్నీళ్లు పెట్టుకుంటుంది. కట్ చేస్తే,విరాజ్ దేని గురించి రా అంతలా ఆలోచిస్తున్నావ్ అని ప్రసాదరావు అంటాడు.
ఆ అమ్మాయి తాళికి అంత ఇంపార్టెంట్ ఇచ్చింది ఏంటి డాడీ అని విరాజ్ అంటాడు. ఆడవాళ్లు మంగళసూత్రాన్ని ఆరో ప్రాణంగా చూస్తారా ఆ అమ్మాయి కాదు ఏ అమ్మాయి అయినా అలాగే ఉంటుంది తన ఆరో ప్రాణం ఉండగానే తన ప్రాణం పోవాలని అనుకుంటారు అంత గొప్పది రా మంగళసూత్రం అని ప్రసాద్ రావు అంటాడు. నీకు పెళ్లి అన్న ఇష్టం లేదు కానీ ఆ అమ్మాయి మంగళ సూత్రాలు పోయాయని బాధపడుతున్నావు కదా పోగొట్టిన నువ్వే మళ్ళీ ఆ అమ్మాయికి ఆ మంగళ సూత్రాలు తెచ్చి ఇవ్వు అని ప్రసాద్ రావు అంటాడు.
అసలు అమ్మాయి ఎవరో ఎక్కడ ఉంటుందో ఆ దొంగ ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు ఎలా ఇవ్వగలను డాడీ అని విరాజ్ అంటాడు. అది మాత్రం తెలియదు రా అంతా ఆ విదికే తెలుసు అని ప్రసాద్ రావు అంటాడు. కట్ చేస్తే,రాధా ఇల్లు తుడుస్తూ ఉండగా రుక్మిణి అక్కడికి వస్తుంది. ఏంటి రాధా ఎలా ఉన్నావు అని రుక్మిణి అడుగుతుంది. బాగున్నాను అని మాత్రం చెప్పకు గతంలో ఏమన్నావ్ నీ దగ్గర సౌభాగ్యమనే నీ భర్త ఉన్నాడు నేను కన్నా ఆ బిడ్డ ఉన్నాడు ఐశ్వర్యం కన్నా ఆ సౌభాగ్యమే నాకు ఐశ్వర్యమని గిర్రవీగావు కదా ఇప్పుడు అవి రెండు నా దగ్గర ఉన్నాయి నువ్వు దిక్కులేని దానిలా ఎలా ఉన్నావు చూడు మీ అత్త మామ నీ పట్టుకుని దిక్కులేని బ్రతుకు బ్రతుకు అని రాదని హీనంగా మాట్లాడుతోంది రుక్మిణి. ఆ మాటలన్నీ చాటుగా వింటాడు శ్యామ్