Malli Nindu Jabili December 29 2023 Episode 533 Highlights: ఇరుగుపొరుగు వాళ్ళు గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తారు మల్లి నీ చూసి ఈవిడే నా కౌసల్యమ్మ గారు ఏరికోరి చేసుకున్న కోడలు తన కాలు ఇంట్లో పెట్టగానే ఇల్లు నాశనం అయిపోయింది కొందరి కాలు అంతే ఇలా వస్తారో లేదో ఇల్లు అంతా నిండా నట్టేట మునిగిపోతుంది అందుకే ఇక్కడ ఉంచే వాళ్ళను అక్కడే ఉంచాలి. కౌసల్యం మా తన స్థాయికి తగ్గట్టు కూడా చేసుకోకుండా ఎవరో అనా ముక్కు రాలి చేసుకుంటే చివరికి ఏగెత్తి పట్టింది చూడండి సో0తి ఇంట్లో నుంచి అద్దె ఇంట్లోకి వచ్చారు అని అందరూ ఏటు పోటి మాటలతో దెప్పిపొడుస్తారు. ఆ మాటలు విన్న మల్లి బాధపడుతూ ఏడుస్తూ బయటే కూర్చుంటుంది. కట్ చేస్తే, అరవింద్ ప్రీతి దగ్గరికి వెళ్తాడు. ఏంటి సార్ మీరు ఇలా వచ్చారు అని ప్రీతి అడుగుతుంది. నీ దగ్గర నుంచి నిజాలు రాబట్టాలని వచ్చాను అని అరవింద్ అంటాడు. నా దగ్గర నిజాలు ఏముంటాయి సార్ అని ప్రీతి అంటుంది. మల్లి చూసుకోకుండా సంతకం పెట్టిన అప్ ప్రౌడ్ చేసి ప్రింట్ చేసింది నువ్వే కదా నీకు తెలియకుండా ఇంత పెద్ద న్యూస్ ఎలా జరిగింది చెప్పు నీ వెనకాల ఎవరు ఉన్నారు ప్రీతి నీకు ఆపద అంటే నీ వెనకాల నేను ఉంటాను నువ్వు తలుచుకుంటే మల్లి కి వచ్చిన కష్టాన్ని తీర్చొచ్చు గౌతమ్ పోగొట్టుకున్న పేరు ప్రఖ్యాతని మళ్లీ తీసుకు రావచ్చు అని అరవింద్ అంటాడు.
దైవసాక్షిగా చెప్తున్నాను నాకేమీ తెలియదు సార్ అని ప్రీతి అంటుంది. నిజం చెప్పు ప్రీతి నిజం డబ్బుకి అమ్ముడుపోయిందా ఎంత తీసుకున్నావు అని అరవింద్ అంటాడు. నేను డబ్బులు తీసుకుని సార్ కి ద్రోహం చేయడం ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు ముందు మీరు బయటికి వెళ్ళండి అని ప్రీతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకు ప్రీతి అంత టెన్షన్ పడుతున్నావ్ ఈరోజు నేను వెళ్ళిపోవచ్చు కానీ ఏదో ఒక రోజు సాక్షాలతో వస్తాను ఆరోజు దీని వెనక నువ్వు ఉన్నావని తెలిస్తే మాత్రం వదిలిపెట్టను అని అరవింద్ వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,మల్లి బయట కూర్చుని చూస్తూ ఉంటుంది. ఇంతలో వసుంధర అక్కడికి వస్తుంది. ఈరోజు బయట ఉన్నవు రేపు రోడ్డు మీద ఉంటావు తర్వాత నెలకొండపల్లిలో ఉంటావు నాతో పెట్టుకుంటారా అని మనసులో అనుకుంటుంది వసుంధర. మల్లి ఏమీ తెలియనట్టు మల్లి బయట కూర్చున్నావ్ ఏంటి నిన్ను లోపలికి రానివ్వట్లేదా నాకు తెలుసు మల్లి గౌతమ్ తలుచుకుంటే ఇలాగే చేస్తాడని అందుకే వాళ్లు నిన్ను బాధ పెడుతూ అన్నమైన పెట్టారో లేదో అని నీకోసం నేను బాక్స్ తీసుకు వచ్చాను తిను మల్లి అని వసుంధర అంటుంది. వసుంధర మాటలు విన్న మల్లి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది.
ఏంటి మల్లి అలా చూస్తున్నావ్ ఎప్పుడు లేనిది అమ్మగారు ఏంటి నాకోసం అన్నం తీసుకువచ్చింది అని అనుకుంటున్నావా నువ్వు నా బిడ్డ లాంటి దానివే మనలో మనకు ఎన్ని ఉన్నా గాని ఇప్పుడు నిన్ను వదులుకుంటామా తిను అని బాక్స్ ఇస్తుంది వసుంధర. మల్లి ఈరోజు నీ స్థానం చెప్పుల కాడ కావచ్చు కానీ రేపు గౌతమ్ గుండెల్లో కూడా ఉండొచ్చు ఎందుకంటే నీ తప్పు లేదని తెలిసిన తర్వాత గౌతమ్ నిన్ను వదులుకోడు అప్పటిదాకా అయినా నువ్వు ఉండాలి కదా మల్లి బాధపడకు మనం చేసుకున్న తప్పులే మనల్ని బాధిస్తూ ఉంటాయి అని వసుంధర అంటుంది.వసుంధర బాక్స్ ఇవ్వగానే మల్లి అన్నం తింటుంది. మళ్లీ నేను తెచ్చిన అన్నం నువ్వు తినవేమో అనుకున్నాను కానీ తింటున్నందుకు చాలా సంతోషం అని వసుంధర అంటుంది. తింటాను అమ్మగారు ఎందుకంటే నా తప్పు ఏమీ లేదని నిరూపించుకోవడానికి నాకు శక్తి ఉండాలి కదా అందుకోసం తింటాను నా మీద కక్ష కట్టినా వెనకాల కుట్ర నడిపిస్తున్న వాళ్లను పట్టుకోవాలి కాబట్టి నేను తింటాను అమ్మగారు అని మల్లి అన్నం తింటుంది.
Malli Nindu Jabili December 29 2023 Episode 533: మల్లి కి అన్నం పెట్టి ఓదారుస్తున్న వసుంధర..
ఇంతలో కౌసల్య అక్కడికి వస్తుంది. ఇంట్లో నేను తినలేదు నా కొడుకు తినలేదు నా కూతురు తినలేదు కానీ నువ్వు మాత్రం కడుపునిండా తింటున్నావా మల్లి వసుంధర నువ్వు మా కుటుంబం మీద కక్ష కట్టి ఇలా చేస్తున్నావ్ కదూ ఎందుకంటే నేను మీ అన్నయ్యని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తే నన్ను బయటికి వెళ్ళగొట్టావ్ అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇలా పగ తీర్చుకుంటున్నావు కదా అని కౌసల్య అంటుంది. వదిన నాకు పాత కక్షలు ఏమీ మనుషుల పెట్టుకోలేదు అలాంటి ఉద్దేశం లేదు అని వసుంధర అంటుంది. నీ బుద్ధి ఏంటో నాకు తెలుసు వసుంధర నువ్వు ఎలాంటి దానివో కూడా నాకు తెలుసు కానీ మాకు ఏదో ఒక రోజు వస్తుంది అప్పుడు చెప్తా నీ సంగతి అంటూ కౌశల్య వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, మీరా గౌతమ్ అన్న మాటలు అన్ని గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది.ఏంటి మీరా ఎందుకు బాధపడుతున్నావ్ ఇప్పుడే నేను మల్లి దగ్గరికి వెళ్లి వస్తున్నాను అక్కడ మల్లి నీ గౌతమ్ వాళ్ళు ఇంట్లో కూడా రానివ్వలేదు కోపంతో అన్నం కూడా పెట్టలేదు అందుకే నేను అన్నం వెళ్లి మళ్లీ కి పెట్టొచ్చాను నువ్వేం బాధపడకు అని వసుంధర అంటుంది.
వసుంధర మాటల్ని గమనిస్తూ ఉంటాడు అరవింద్. ఎంతైనా మల్లి నా కూతురు లాంటిదే కదా మీరా అప్పుడు ఏదో కోపం ఉండి అలా చేశాను కానీ ఇప్పుడు తన పరిస్థితిని చూసి నాకు జాలి వేస్తుంది కానీ మల్లి కోరి తెచ్చుకున్న కష్టాలు ఇవి ఆ ధర్మారావు గారి గురించి రాసి పేపర్లో ప్రకటించడం వల్ల గౌతమ్ కుటుంబమంతా రోడ్డున పడింది అందుకే వాడు మల్లి మీద కోపంతో ఉన్నాడు నాలుగు రోజులాగితే కోపం పోయి మామూలు మనిషి అవుతాడు లే కానీ నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళకు నువ్వు కానీ నేను కానీ ఎవరం వెళ్ళినా వాళ్లకు ఇంకా కోపం పెరిగి మల్లి నీ దూరం పెడుతూ ఉంటారు అందుకని మనం వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది అని వస్తుందరా అంటుంది. నా కూతురికి పెట్టడం పెట్టే అంత స్తోమతలో కూడా లేను అమ్మగారు అని మీరా ఏడుస్తుంది.
మనము ఎన్ని అనుకున్నా చేసిన తప్పులకు శిక్ష అనుభవించాలి కదా మీరా అని వసుంధర అంటుంది. తప్పంతా నాదేనమ్మ నా కడుపున పుట్టి కపోతే ఈ కష్టాలు వచ్చేవి కాదు ఏ గొప్ప ఇంట్లోనో పుట్టి ఆనందంగా ఉండేది అని మీరా బాధపడుతుంది. నా కడుపులో చిచ్చు పెట్టి నీ కూతురు నువ్వు ఆనందంగా ఉంటారా నీకు మా ఆయనకు పెళ్లి చేస్తుందా మల్లి నేను ఊరుకుంటానా దానికి తగిన శాస్తి చేశాను ఇంకా ఇప్పుడే ఏముంది మీరు ముందు ముందు చాలా ఉంది అని వసుంధర అనుకుంటుంది. సరేగాని మీరా నువ్వు మాత్రం పొరపాటున మల్లి దగ్గరికి మాత్రం వెళ్ళకు అని వస్తుంది రా వెళ్ళిపోతుంది. మల్లి బతుకు ఏమైపోతుందో అని మీరా బాధపడుతూ ఉంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?