Malli Nindu Jabili : ఆగండి ఎక్కడికి వెళ్తారు నా అల్లుడ్ని అన్ని మాటలు అనేసి వెళ్ళిపోతారా నా అల్లుడ్ని అనడం కాదు ముందు నువ్వు హద్దుల్లో ఉండు అని వసుంధర అంటుంది. కంటే ముందు మీరు హద్దుల్లో ఉండండి ఉండకపోతే మాత్రం మర్యాదగా ఉండదు అని మల్లి అంటుంది. ఏంటే నాకే వార్నింగ్ ఇస్తున్నావ్ అని వసుంధర అంటుంది. వార్నింగ్ కాదు రోడ్డుమీదికి ఏడ్చి మీ పరువు తీసేస్తాను అని మల్లి అంటుంది.నా పరువు తీయాలని ఎందుకు అనుకుంటున్నావే అని వసుంధర అంటుంది. మీ నాటకాల గురించి మాట్లాడుతున్న నిజాల గురించి మాట్లాడుతున్నాను అని మల్లి అంటుంది.నీకు నిజంగానే పిచ్చి పట్టినట్టుంది అని వసుంధర అంటుది. నటించకండి వసుంధర గారు నా సర్టిఫికెట్లు మీరే దొంగతనం చేశారు అని మల్లి అంటుంది. ఈ సర్టిఫికెట్ తో నాకేం పని నాలిక గీసుకోవడానికి కూడా పనికిరావు అని వసుంధర అంటుంది. ఇందాక దారిలో నువ్వు అరేంజ్ చేసినా అతను కనిపించడు నాలుగ తగిలిస్తే నిజం చెప్పాడు అని మల్లి అంటుంది. ఎవడో దారిన పోయే వాడు చెప్తే నామీద నిందలు మోపుతావా అని వసుంధర అంటుంది.
అమ్మగారు మీరు దబాయించకండి మీరు మల్లి సర్టిఫికెట్ కాల్చడం నేను కళ్ళారా చూశాను అని మీరా అంటుంది. నాకెందుకు చెప్పలేదు మీరా నేనే వసుంధర అని అడిగేవాణ్ణి కదా అని శరత్ అంటాడు. వాళ్ల మాటలు మీకు వేదాలు అయిపోయాయా అని వసుంధర అంటుంది. నీ నైజం గురించి నాకు తెలుసు కదా మల్లి ఇలా చేయడం వల్ల కొంతమంది మనుషుల్లో ఉన్న అనుమానాలన్నీ క్లియర్ అయిపోయిన ని జీవితం సంతోషంగా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని శరత్ అంటాడు. అలా మీరు అనుకుంటే సరిపోదు ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు అని వసుంధర అంటుంది. అవును అమ్మగారు ఎవరి కర్మ వాళ్లకే తప్పకుండా తగులుతుంది అమ్మగారు ఈరోజు వాడు నా ఎదుటపడ్డాడు కాబట్టి మీ గురించి నిజాలు తెలిసాయి సాక్షాలు లేకపోయినా మరో విషయంలో కూడా మీరే అని నాకు అనుమానం వస్తుంది మినిస్టర్ ధర్మారావు గారి గురించి తప్పుడు రాతలు రాయించి మా ఆఫీసు ఆస్తులు అన్ని పోయేలా చేసింది మీరే అని మల్లి అంటుంది. ఏంటే తప్పుడు కుతలు కూస్తున్నాం ఆధారాలు లేని నిందలు వేస్తున్నావ్ అని వసుంధర అంటుంది.
ఆధారాలు దొరికిన రోజున వేరే లెవెల్ లో ఉంటుంది వసుంధర దేవి గారు అని మల్లి అంటుంది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని వసుంధర మల్లి మీదికి చెయ్యి లేపుతుంది వెంటనే మీరా తన చేయి పట్టుకొని అమ్మగారు నా కూతురు మీద చెయ్యి వేయలేరు అని అంటుంది. చెయ్యి దించండి వసుంధర దేవి గారు లేదంటే నేను చెయ్యి ఎత్తల్సి ఉంటుంది అని మల్లి అంటుంది. గుర్తుంచుకో వసుంధర దేవి ఈరోజు నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇన్ని రోజులు నా తల్లి మీ ఇంట్లో ఉంటుందని నా తండ్రికి భార్యని మిమ్మల్ని వదిలేసాను ఇకనుంచి వదలను అని మల్లి అంటుంది. ఏం చేస్తావే అని వసుంధర అంటుంది. నా కుటుంబాన్ని టచ్ చేసి చూడు మల్లి అంటే ఏంటో చూపిస్తాను నీకు మల్లి అంటే మల్లెపూల కాదు తన కుటుంబం జోలికి వస్తే మంటలు ఎగిసి పడుతుందని తెలుసుకుంటారు మీరు నా జీవితాన్ని మీరు డిస్టర్బ్ చేయకండి మీ జీవితాన్ని నేను డిస్టర్బ్ చేయను అని మల్లి అంటుంది.
ఇదంతా నాకు అనవసరం గంట నుంచి నన్ను వేధిస్తుంది ఏంటి అంటే నువ్వు భర్తగా సైన్ చేసి సర్టిఫికెట్ తీసుకురావడం ఇంకోసారి నా భార్య ని కలవడానికి వచ్చావంటే చంపేస్తాను అని గౌతమ్ అరవింద్ ని బెదిరిస్తాడు. వాళ్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నాకే వార్నింగ్ ఇస్తుందా దాని సంగతి చూస్తాను అని వసుంధర అంటుంది.మీరు మంచే చేశారు కానీ దేవుడు ఒక్కోసారి ఇలాంటి పరీక్షలు పెడతారు బాబు గారు మీరేం బాధపడకండి అని మీరా అంటుంది. కట్ చేస్తే,అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఏంటి గౌతమ్ ఇది తాళిబొట్టు నాటకం ఆడితే మల్లి తప్పు ఏమీ లేదని నువ్వు నమ్ముతున్నావా నేను మాత్రం నమ్మను అని కౌసల్య అంటుంది. వసుంధర గారి వసుంధర గారి వల్లే మనం రోడ్డున పడ్డామని వదిన అందరి ముందు చెప్పేసింది నీ కళ్ళ ముందే అంత జరిగిన నువ్వు ఇలా మాట్లాడతావ్ ఏంటమ్మా అని నీలిమ అంటుంది. ఏవండీ మీరు అందరి ముందు నా భార్య అని సరికి నా గుండెల్లో ఉన్న బాధ అంతా పోయినట్టు అనిపించింది అని మల్లి అంటుంది. గౌతమ్ మౌనంగా వెళ్ళిపోతాడు.
వాడు మౌనంగా వెళ్లిపోయాడని క్షమించాడు అనుకుంటున్నావా కౌసల్య అంటుంది.అంతే కదా అమ్మ వదిన ముందు కళ్ళు ఎత్తి భగభగ మండే సింహంల చూసేవాడు అలాంటిది పశ్చాత్తాపంతో చూస్తున్నాడు అని నీలిమ అంటుంది. ఈరోజు నా కొడుకు మౌనంగా ఉన్నాడంటే దీన్ని క్షమించినట్టు కాదు మీరే చూస్తూ ఉండండి అని కోపంగా కౌసల్య వెళ్ళిపోతుంది. నువ్వు అమ్మ మాటలు ఏమీ పట్టించుకోకు వదిన అన్నయ్య ఏదో ఒక రోజు నిన్ను దగ్గరికి తీసుకుంటాడు అని నీలిమ అంటుంది. కట్ చేస్తే గౌతమ్ మల్లి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
సీతమ్మ తల్లి రామయ్య తండ్రి నా భర్త నన్ను అర్థం చేసుకుని దగ్గరికి తీసుకునేలా చేయండి అని మల్లి అంటుంది. గౌతమ్ ఆలోచిస్తూ ఉండగా తన అంతరాత్మ బయటికి వచ్చి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు నీ భార్య మీద అనుమానం పోలేదా అని అంటుంది. నా కళ్ళ ముందు జరిగిందంతా ఆలోచిస్తున్నాను అని గౌతమ్ అంటాడు. మన కళ్ళముందు జరగని వాటికి సాక్షాలు కావాలి కానీ ఇదంతా నీ కళ్ళముందే జరిగింది కదా ఇంకా సాక్షులు కావాలా అని ఆత్మ అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?