Mamagaru: రౌడీల అడ్రస్ తెలుసుకున్న గంగా గంగాధర్ వాళ్ళు మున్సిపార్టీల వేషం వేసుకొని పిల్లల్ని కాపాడదామని అనుకుంటారు. గంగ ముందు వెళ్లి డోర్ కొట్టి చెత్త ఉందా సార్ అని అడుగుతుంది. అతను చెత్త తెచ్చి ఇవ్వగానే గంగాధర్ మహేష్ పాండురంగా సుధాకర్ రౌడీల మీద పడిచిత కొట్టి పిల్లని కాపాడుతారు. రేయ్ మహేష్ ఈ రౌడీలను పోలీసులకు అప్పగించ రా మేం పిల్లని తీసుకొని వెళ్ళిపోతాం అని సుధాకర్ అంటాడు. అలాగే అన్నయ్య అని మహేష్ అంటాడు. పిల్లలు వీళ్లు కిడ్నాప్ చేసినట్టు తాతయ్యకు చెప్పకూడదు మీ స్కూల్లో ఆటలు పోటీలు జరుగుతున్నాయి అని నేను చెప్పాం మీరు అలాగే చెప్పండి అని సుధాకర్ అంటాడు. ఎందుకు పెదనాన్న అని వాళ్లకు పిల్లలు అడుగుతారు. తాతయ్యకి నిజం తెలిస్తే బాధపడతారు అందుకే చెప్పొద్దంటున్నాను అని పాండురంగ అంటాడు. థాంక్స్ అన్నయ్య నువ్వు ఇంత సహాయం చేసినందుకు అని గంగా అంటుంది. మనలో మనకు థాంక్స్ ఎందుకమ్మా అని మహేష్ అంటాడు. కట్ చేస్తే,
అత్తయ్య ఇంకా పిల్లలు దొరకనట్టున్నారు వాళ్ళు ఫోన్ చేయలేదు మామయ్యకి నిజం చెప్పేద్దాము అని శ్రీలక్ష్మి అంటుంది. నేను చెబుదామని అంటున్నాను కదా మా మీరే వద్దన్నారు అని దేవమ్మ అంటుంది. పిల్లలు దొరికితే ఫోన్ చేస్తానన్నారు కదా కొద్దిసేపు ఆగుదామని వసంత అంటుంది. నువ్వు కేసు వాదిస్తుంటే నా పిల్లలు ని ఎందుకు అక్క కిడ్నాప్ చేశారు చేయాలంటే నీ పిల్లల్ని కదా చేయాలి ఎవరో చేసిన పాపం నాకు చుట్టుకొని నేను బాధపడాల్సి వస్తుంది అని శ్రీ లక్ష్మీ అంటుంది. అదేంటి శ్రీలక్ష్మి అలా0టావ్ మేము వేరు మేం వేరు అని అని దేవమ్మ అంటుంది. లేకపోతే ఏంటి అత్తయ్య వసంత అక్క చేసే జాబ్ వల్ల పిల్లలు కిడ్నాప్ అయ్యారు వాళ్లు లేకుండా దొంగచాటుగా మామయ్యకు తెలియకుండా ఏడవడం నా వల్ల కావట్లేదు ఎలాగైనా సరే మామయ్యకు చెప్పేస్తాను అని శ్రీలక్ష్మి అంటుంది. చెప్పనివ్వండి అత్తయ్య ఎలాగూ చెప్పేస్తానని డిసైడ్ అయింది కదా శ్రీ లక్ష్మక్క అని వసంత అంటుంది. ఇంతలో చంగయ్య స్నానం చేసి బయటికి వచ్చి పూజ చేస్తూ ఉంటాడు. పదండి అత్తయ్య ఈరోజు మామయ్య గారికి నిజం చెప్పేద్దాం అని వాళ్ళు ముగ్గురు చంగయ్య దగ్గరికి వెళ్తారు. చ0గయ్య పూజ చేసిన తరువాత ఏమండీ మీకు ఒక విషయం చెప్పాలి అని దేవమ్మ అంటుంది. ఏంటో చెప్పు దేవమ్మ అని చ0గయ్య అంటాడు. పిల్లలు పిల్లలు అని దేవమ్మ మాట తడబడుతుంది. ఏమైంది పిల్లలు స్కూల్ నుంచి ఇంకా ఇంటికి రాలేదా అని చ0గయ్య అంటాడు. అది కాదండి పిల్లలు అని దేవమ్మ అంటూ ఉండగా చ0గయ్య కి ఫోన్ వస్తుంది. చ0గయ్య ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్తాడు. హలో చ0గయ్య గారు నేనండి అని అతను అంటాడు. మీకోసమే బయలుదేరి వస్తున్నానండి అని చ0గయ్య అంటాడు. కట్ చేస్తే,
చ0గయ్య బట్టలు వేసుకుని రెడీ వచ్చి ఏంటి దేవమ్మ ఇందాకేదో చెప్పాలన్నావ్ చెప్పు అని అంటాడు. ఇంతలో పిల్లలు పరుగెత్తుకొచ్చి నాయనమ్మ అని అంటారు. రండిరా పిల్లలు మీ కోసమే ఎదురు చూస్తున్నాను మి కోసం చాక్లెట్ తెచ్చాను రండి అని చ0గయ్య అంటాడు. శ్రీలక్ష్మి వసంత పిల్లల్ని చూసి సంతోష పడిపోతారు. దేవమ్మ ఇందాకే ఏదో చెప్పాలన్నావు ఏంటి చెప్పు అని చ0గయ్య అంటాడు. ఏమీ లేదండి పిల్లలకి కొత్త బట్టలు తీసుకుంటున్నా అన్నారు కదా అని దేవమ్మ అంటుంది. చంగయ్య చాక్లెట్ తెచ్చి పిల్లలకు ఇస్తూ ఏంట్రా మొహాల పీక్కుపోయాయి తినడం లేదా అని అంటాడు. నాన్న మీకు బయటికి వెళ్లే టైం అయినట్టుంది వెళ్లి రండి తర్వాత వాళ్లతో కబుర్లు చెప్పుకొందురు గాని అని సుధాకర్ అంటాడు. సరే పిల్లలు నేను బయటికి వెళ్లి వస్తాను మీరు స్కూలుకు వెళ్ళండి అని చ0గయ్య వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,
ఇంతలో వసంత కి వాళ్ళ సార్ ఫోన్ చేసి కంగ్రాజులేషన్స్ మేడం మీ పిల్లలు ఇంటికి తిరిగి వచ్చారంట కదా అని అంటాడు.అవును సార్ ఇకమీదట నేను కేసు వాదించను ఎవరికైనా అప్పజెప్పండి అని వసంత అంటుంది. అదేంటమ్మా నువ్వు వాదించకపోతే ఎలా సరే వేరే లాయర్ కన్నా పేపర్లు ఇచ్చి వెళ్ళు అని వాళ్ళ సార్ అంటాడు. ఎవరు వసంత ఫోన్ చేసింది అని సుధాకర్ అంటాడు. మా సార్ ఫోన్ చేశాడండి అని వసంత చెప్తుంది. ఇంత జరిగాక కూడా నువ్వు కోర్టుకు వెళ్లి కేసు వాదిస్తావా అక్క నువ్వు కోర్టు కి వేల్ల అక్కర్లేదు అని శ్రీలక్ష్మి అంటుంది. నన్ను నేను కేసు వాదించట్లేదు కానీ పేపర్లు వేరే లాయర్ కిచ్చి వెళ్ళమని చెప్పాడు సర్ వెళ్ళుస్తాను అని వసంత వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,
ఏంటి మేడం మీరు ఇలా భయపడి కేసు ను వదిలేస్తే మీ పిల్లల కిడ్నాప్ చేసే వేరే పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడు అలాంటి వాడిని వదిలేయకూడదు మేడం వాడిని ఓడించి జైల్లో పెట్టాలి కానీ మీరే భయపడి పోతే నేను కూడా మీలాగే భయపడాల్సి ఉంటుంది అతను అధర్మంగా గెలిచి తల ఎగిరేసుకొని వెళ్తుంటే నేను అతని ముందు ధర్మంగా ఉన్నా కానీ ఓడిపోయే తలదించుకోవాల్సి ఉంటుంది మీరే చెప్పారు కదా మేడం ఆలస్యమైన ధర్మమే గెలుస్తుందని కానీ ఇప్పుడు అధర్మం ధర్మంగా గెలుస్తుంది మీరు కేసు మాత్రం వాదించకండి మేడం మీ పిల్లలతో మీరు ఆనందంగా ఉండండి ఎవరి పిల్లలు ఏమైపోతే మీకేంటి అని వాళ్ళ సార్ అంటాడు.ఆ మాటలన్నీ విన్న వసంత కేసును వాదిస్తుంది.కట్ చేస్తే,
కేసు ఇరుపక్షాల వారు వాదిస్తారు. యువరానర్ ఆ పేపర్లో ఉన్న సంతకం టెస్ట్ చేస్తే అందులో పెట్టిన ఇంకు పాతకాలంది అది చెల్లదని రిపోర్టు ఇచ్చారు అందుకని వాళ్లు మోసం చేసి ల్యాండ్ లాక్కున్నారు కాబట్టి నా క్లైంట్ కు న్యాయం జరిగేలా చేయండి యువరానర్ వాళ్ళకి శిక్ష పడేలా చేయండి అని వసంత అంటుంది..
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?