Padmanabham: పద్మనాభం అంటే.. తెలుగు సినిమా స్వర్ణ యుగం రోజుల్లో కమెడియన్, హీరో, ప్రొడ్యూసర్. ఇలా అన్ని రంగాల్లో ఓ వెలుగు వెలిగాడు పద్మనాభం. సుమారు 400 సినిమాల్లో నటించిన మంచి పేరు ఉన్న నటుడు పద్మనాభం. ఆ కాలంలో పద్మనాభం గురించి తెలియని తెలుగు ప్రేక్షకులే లేరు. అంతగా తన సినిమాలతో ఆకట్టుకున్నాడు మరి. ఇక అలాంటి పద్మనాభం ఆఖరి రోజుల్లో అత్యంత దీనస్థితిలో మృతి చెందారు. బసవరాజ వెంకట పద్మనాఛరాజు .. పద్మనాభం అసలు పేరు. 1931 ఆగస్టు 20న జన్మించిన పద్మనాభం.. తన 12వ ఏటని నటనలో హరితేరారు. అది కూడా ఆ కాలపు దిగ్గజ దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం.. మాయ దీపం ద్వారా. అనంతరం 80 మంది దర్శకుల దగ్గర పనిచేశాడు పద్మనాభం.
వాళ్లలో రామబ్రహ్మంతో పాటు కేవీరెడ్డి వంటి పెద్ద దర్శకులు కూడా ఉన్నారు. అప్పట్లో కామెడీ పాత్రలను పర్ఫెక్ట్ టైమింగ్స్ లో చేసే నటులలో పద్మనాభం కూడా ఒకరు. పద్మనాభం కేవలం కామెడీకే పరిమితం కాకుండా కరుణ రసాలు కూడా అద్భుతంగా పండించేవాడు. పద్మనాభం కి కరుణరసాల అంటే ఎంత ఇష్టమో ఆయన జీవితం లో అదే రసం ఆయనని ఇబ్బంది పెట్టింది. మొత్తం 8 చిత్రాలకి దర్శకత్వం వహించాడు పద్మనాభం. ఎస్బి బాలసుబ్రమణ్యం ని గాయకుడిగా తెలుగు తెరకు పరిచయం చేసింది పద్మనాభమే. మర్యాద రామన్న వంటి చిత్రాల్లో బాలసుబ్రమణ్యం పాడడం వల్లనే అనంతర కాలంలో బాలసుబ్రమణ్యానికి అంత గుర్తింపు దక్కింది.
అలా కొందరికి అవకాశాలు ఇప్పిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేశాడు పద్మనాభం. దీంతో తన దగ్గర ఉన్న ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది. అలా దివాలా తీశాడు పద్మనాభం. అప్పటికే పద్మనాభం కి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. వీళ్ళ ద్వారా ఒక కొడుకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వీళ్ళెవరు ఈయనని దగ్గరికి చేర్చుకోలేదు. ప్రమీన అనే ఓ చిన్న నటి మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ తో ఆయన చివరి రోజుల్లో సహజీవనం చేశారు. అన్ని పోగా ప్రమీలకి ఇచ్చిన అగ్గిపెట్టి లాంటి ఒక ఇల్లు మాత్రమే మిగిలింది. ఆ సమయంలో కూడా ఈనని అప్పులు వెంటాడాయి. రాజబాబు కూడా తన జీవిత చివరి రోజుల్లో పద్మనాభం డబ్బు అడిగారు.
తన దగ్గర అప్పు తీసుకున్న డబ్బును ఇవ్వమని పద్మనాభాన్ని రాజబాబు అడిగాడు. ఇక అప్పుడు పద్మనాభం తన ఇల్లు పత్రాలను తీసుకొచ్చి రాజబాబు చేతిలో పెట్టాడు. ఇక అప్పుడు రాజబాబు ఉన్న నిలువు నీడని కూడా లాగేసుకుని నీకు ఇల్లు కూడా లేకుండా చేసే అంత పాపాత్ముడిని కాదు.. అని వెళ్ళిపోయాడు. అప్పటి కాలంలో ఒకరికి మరియు ఇంకొకరికి మధ్య ఎంత ప్రేమలు ఉండేవి. అందువల్లే పద్మనాభం తీసుకున్న అప్పులను సరిగ్గా కట్టకపోయినా ఎవరు పెద్దగా మాట్లాడలేదు. అలా ఆఖరి రోజుల్లో దీనస్థితిలో ఉన్న పద్మనాభాన్ని ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆదుకుంది. అలా ఉన్నప్పుడు తనకి తోడుగా ఉన్న ఫ్యామిలీ ఏమీ లేనప్పుడు విడిచి వెళ్లిపోయింది.