Sowmya Rao: జబర్దస్త్.. బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షోస్లో ఒకటి. జబర్దస్త్ ద్వారా ఎందరో కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలాగే ఈ షో ద్వారా అనసూయ, రష్మీ వంటి యాంకర్లు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఒకప్పుడు జబర్దస్త్ కు అనసూయ.. ఎక్ట్రా జబర్దస్త్ కు రష్మీ గౌతమ్ యాంకర్లుగా వర్క్ చేసేవారు. అయితే జబర్దస్త్ నుంచి అనసూయ తప్పుకోవడంతో ఆమె స్థానంలో కన్నడ బ్యూటీ సౌమ్య రావును తీసుకొచ్చారు.
కానీ సౌమ్య రావు కూడా ఇటీవల జబర్దస్త్ ను వీడింది. ప్రస్తుతం బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్ జబర్దస్త్ షోకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. అయితే జబర్దస్త్ వీడటంపై తాజాగా సౌమ్య రావు నోరు విప్పింది. ఈ షో ద్వారా తనకు ఎదురైన చేదు అవుభవాలను పంచుకుంది. సౌమ్య రావు మాట్లాడుతూ.. `ప్రేక్షకుల్లో కొంతమంది నన్ను యాంకర్గా అంగీకరించారు. కొందరు మాత్రం అంగీకరించలేదు. తెలుగులో ఎంతో అందమైన అమ్మాయిలు ఉండగా.. తెలుగు రాని ఈ కన్నడ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారంటూ అసహ్యంగా మాట్లాడేవారు.
నా తెలుగు దరిద్రంగా ఉందంటూ దారుణంగా విమర్శలు చేసేవారు. యాంకరింగ్ రాదు.. తెలుగు రాదు.. డ్యాన్స్ రాదంటూ తిట్టేవారు. అప్పుడప్పుడే కెరీర్ మొదలు పెట్టిన నేను ఆ విమర్శలను తట్టుకోలేకపోయాను. నరకం చూశాను` అంటూ చెప్పుకొచ్చింది. అలాగే డ్యాన్స్ నేర్చుకుందామని క్లాసులకు వెళ్తే.. తాను మరింత సన్నగా మారిపోయాయని, దాంతో జబర్దస్త్ డైరెక్టర్ ముఖంపైనే మీరు డ్యాన్స్ ఏం నేర్చుకోవద్దు, బాగా తిని కాస్త లావు అవ్వమని చెప్పారంటూ సౌమ్య రావు తెలిపింది.
అలాగే పాత యాంకర్స్ మాదిరి ఎంటర్టైన్ చేయాలని తాను చాలా ప్రయత్నించానని.. కానీ తెలుగు రాకపోవడం, డ్యాన్స్ పూర్గా ఉండటం, స్కిట్లో వాళ్లు చెప్పే కొన్ని పదాలు అర్థం చేసుకోలేకపోవడం వంటి అంశాలు తనకు బాగా మైనస్ అయ్యాయని సౌమ్య రావు పేర్కొంది. అందుకే జబర్దస్త్ మానేశానంటూ వెల్లడించింది. జబర్దస్త్ వీడడానికి తనలో ఉన్న లోపాలే కారణమని సౌమ్య రావు పరోక్షంగా చెప్పకనే చెప్పేసింది.