Salt: ఉప్పు వంటకు రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది.. అదే ఎక్కువైతే కూరతో పాటు ఆరోగ్యం కూడా పాడవుతుంది.. మనం ఉప్పు ఎక్కువగా వేస్తుంటే తగ్గించుకోవచ్చు కానీ.. మనం తినే ఆహార పదార్థాల మాటేమిటి.. పిజ్జా, బర్గర్, శాండ్విచ్, బేకరీ ఐటమ్స్, ప్యాకింగ్ ఫుడ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు.. వీటిని ఎక్కువగా తినడం వలన శరీరంలో సోడియం ఎక్కువగా చేరిపోతుంది.. అలాంటప్పుడు సోడియం బ్యాలెన్స్ చేసే ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి.. వాటిని తీసుకుంటే సరిపోతుంది.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఉప్పు ఎక్కువ తీసుకుంటే బీపీ లెవల్స్ పెరుగుతాయి. వాటిని అదుపులో ఉంచాలి అంటే పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అరటిపండు లో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. వీటిని ఎక్కువ ఆహారం తిన్న తర్వాత తీసుకుంటే బిపి లెవెల్స్ నియంత్రణలో ఉంచుతుంది. ఇంకా స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుంది. సోడియం లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడంలో అల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తిన్న వెంటనే ఒక్కసారి అల్లం టీ తాగి చూడండి. మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
Read More: Diabetes: ఈ డ్రింక్స్ తాగితే డయాబెటిస్ తగ్గడం పక్కా..!!
ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తిన్న వెంటనే నోరు అంతా పాడైపోయినట్టు ఉంటుంది. వికారంగా, అదోరకంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు వెంటనే కివి పండు ఒకటి తినండి. సోడియం లెవెల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది .ఈ పండులో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇంకా డైజేషన్ కూడా మెరుగుపరుస్తుంది. మీరు ఎప్పుడైనా ఉప్పు ఎక్కువగా వేసుకున్నా లేదంటే ఉప్పు వేసిన ఆహార పదార్థాలు తిన్న వెంటనే ఒక చెంచా పెరుగు నోట్లో వేసుకోండి. బ్లోటింగ్ కూడా తగ్గుతుంది. అందుకే కూరలో ఉప్పు ఎక్కువయింది అనగానే ఒక చెంచా పెరుగు కలుపుకుని పెద్దలు చెబుతారు. సాల్ట్ ఫుడ్స్ తిన్న వెంటనే నాలుగు పదార్థాలు తీసుకోవటం వలన ఆ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి రక్షించుకోవచ్చు.