Pink lagoon: అర్జెంటీనా దేశంలోని పెటగోలియా ప్రాంతంలో ఏరులై పారుతున్న పింక్ ద్రవం చూపరులను ఆకట్టుకుంటుంది. అయితే ఆ గులాబీ రంగు ద్రవం ఏమిటో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఈ గులాబీ రంగు ద్రవంతో ఉన్న ముడుగు చూపరులను ఆకట్టుకుంటున్నా దానిలో చాలా హానికరమైన రసాయనాలు ఉన్నాయట. చేపలు, రొయ్యలు కుళ్లిపోకుండా భద్రపరిచేందుకు వాడిన ఒక రసాయనం వల్ల ఈ మడుగు పింక్ కలర్ గా మారిపోయిందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
ఫిష్ ఫ్యాక్టరీల్లో సోడియం సల్పేట్ ను యాంటీ బ్యాక్టీరియల్ ప్రొడక్ట్ గా ఉపయోగిస్తారు. సోడియం సల్ఫెట్ ను ఫ్యాక్టరీలో ఇష్టానుసారంగా వాడుకుంటూ మిగిలిన వ్యర్ధాలను చూబుల్ నదిలోకి వదిలివేస్తున్నారు. దీంతో ఈ నది పూర్తిగా కలుషితం అయి పింక్ కలర్ లోకి మారింది. ఆ నదిపై అధారపడిన పలు మడుగులు కూడా గులాబీ రంగులోకి మారాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర దుర్గంధం సమస్యను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నది చుట్టు పక్కల అనేక పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని కొందరు ఫిర్యాదులు చేశారు.
అక్కడి విదేశీ కంపెనీలకు ప్రభుత్వ సహకారం ఉండటంతో ప్రజల ఫిర్యాదులను పట్టించుకోవడం లేదట. వారి ఇష్టానుసారంగా వ్యర్ధాలను నదిలోకి వదులుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడమే కాకుండా ఆ ముడుగులు గులాబి రంగు మారినప్పటికీ ఎటువంటి హానీ చేకూరదని అధికారులు సమర్ధిస్తున్నారుట. అయితే పర్యావరణ కార్యకర్త పాబ్లో ఈ కాలుష్యంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వ అధికారుల తీరును ఆయన దుయ్యబడుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించాల్సిన ప్రభుత్వమే కాలుష్యాన్ని పెంచుతుందని విమర్శించారు. నదులను కలుషితం చేసే వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హానికరమైన సోడియం సల్ఫేట్ ను నదిలోకి వదిలిపెట్టకూడదని పర్యావరణ ఇంజనీర్, వైరాలజిస్ట్ ఫెడెరికో రెస్ట్రెపో పేర్కొంటున్నారు. ఇది చట్టవిరుద్దమని కూడా ఆయన అంటున్నారు.