BJP: అధికారం విషయంలో ఇటీవలే ఆశలు అడియాశలు అయిన పశ్చిమ బెంగాల్లో బీజేపీ కి మరో షాక్ తగలనుందని తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ రథసారథి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఒకప్పటి నమ్మినబంటు, సీనియర్ నేత ముకుల్ రాయ్ తిరిగి టీఎంసీలో చేరనున్నట్లు పరిణామాలు కనిపించడమే ఈ షాక్. ఈ మేరకు జరుగుతున్న పరిణామాలను బీజేపీ జాగ్రత్తగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది.
Read More: Modi: మోడీ కి పెద్ద రిలీఫ్… కరోనా సెకండ్ వేవ్ కష్టాలు తేలేదట
ముకుల్ రాయ్ హర్టయ్యారట..
ముకుల్ రాయ్ టీఎంసీలో కీలక నేతగా ఉన్నారు. 2017లో బీజేపీలోకి చేరిన రాయ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీ నేతలను కమలం పార్టీలో చేర్చడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే, టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి విషయంలో ఆయన హర్టయ్యారట. అసెంబ్లీ ఎన్నికల్లో దీదీపై గెలుపొందిన సువేందు అధికారికి బీజేపీ అధిక ప్రాముఖ్యతనివ్వడంతో ముకుల్ రాయ్, అధికారిల మధ్య గ్యాప్ పెరిగినట్టు సమాచారం. అందుకే కొంతకాలంగా ఆయన బీజేపీ వ్యవహారాల్లో అంటిముట్టనట్లు ఉంటున్నారు. ఇటీవలే కోల్కత్తాలో బీజేపీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి ముకుల్ రాయ్ డుమ్మా కొట్టడంతో ఆయన తిరిగి టీఎంసీలో చేరబోతున్నాడన్న అంశం హాట్ టాపిక్ అయింది.
Read More: Modi: రైతు వ్యతిరేక చట్టాలు మోడీ ఎప్పుడు ఉపసంహరించుకుంటారంటే…
కారణాలు ఇవి…
ముకుల్ రాయ్ సతీమణి అనారోగ్యంతో ఓ హాస్పిటల్లో చేరినప్పుడు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ స్వయంగా వెళ్లి పరామర్శించడంతో ఆయన తిరిగి టీఎంసీ వైపు చూస్తున్నారని టాక్ వచ్చింది. ఇదే సమయంలో బీజేపీ అప్రమత్తమైంది. అనంతరం ప్రధాని మోడీ ముకుల్ రాయ్కు ఫోన్ చేసి మాట్లాడారు. అయితే, తాజాగా టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ కామెంట్ ముకుల్ రాయ్ టీఎంసీలో చేరికపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బీజేపీలో చేరిన చాలా మంది నేతలు తిరిగి రావడానికి యోచిస్తున్నారని, అభిషేక్ బెనర్జీతో చాలా మంది టచ్లో ఉన్నారని పేర్కొన్నారు. దీంతో మళ్లీ బీజేపీలో కలవరం మొదలైంది.