Breaking: మహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుండి బహిష్కరణకు గురైన నుపుర్ శర్మ పై పశ్చిమ బెంగాల్ కోల్ కతా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నుపూర్ శర్మ పై నార్కెల్ దంగా, అమ్హెర్స్ట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ లలో నమోదు అయిన ఫిర్యాదులపై విచారణకు హజరు కావాలని నోటీసులు జారీ చేసినా ఆమె హజరు కాలేదు. దీంతో పోలీసులు ఆమెపై లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నుపూర్ శర్మ పై నార్కెల్ దంగ పోలీసు స్టేషన్ లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీని ఆధారంగా విచారణ నిమిత్తం గత నెల 20వ తేదీన హజరుకావాలని పోలీసులు సమన్లు జారీ చేశారు. అయితే భద్రతాపరమైన సమస్యలను లెవనెత్తి నుపూర్ శర్మ గడువు కోరారు. అదే విధంగా అమ్హెర్స్ట్ స్ట్రీట్ పోలీసులు కూడా రెండు సార్లు ఆమెకు నోటీసులు జారీ చేశారు. నాలుగు పర్యాయాలు పంపిన నోటీసులకు విచారణకు హజరు కాకపోవడంతో పోలీసులు ఆమెపై లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు.
నుపూర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గత నెలలో బెంగాల్ లోని వివిధ జిల్లాల్లో జరిగిన పెద్ద ఎత్తున నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి,. వివిద ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుుకున్నాయి. ఈ క్రమంలోని వివిధ నగరాల్లోని పలు పోలీస్ స్టేషన్ లలో ఆమెపై ఫిర్యాదులు నమోదు అయ్యాయి. పోలీసు వర్గాల సమాచారం మేరకు కోల్ కతాలోని వివిధ పోలీసు స్టేషన్ లలో పది కేసుల వరకూ సుపూర్ శర్మ పై నమోదు అయ్యాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ నుపూర్ శర్మపై కేసులు నమోదు అయినప్పటికీ ఏ రాష్ట్ర పోలీసులు ఆమె పై చర్యలకు తీసుకోలేదు.
వివిధ రాష్ట్రాల్లో నమోదు అయిన కేసులను తన భధ్రత దృష్ట్యా ఢిల్లీకి మార్చాలని కోరుతూ నుపూర్ శర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించగా ధర్మాసనం ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె అభ్యర్ధనను తిరస్కరించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశంలో ఘర్షణలకు కారణమైన నుపూర్ శర్మపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఢిల్లీ పోలీసులను సైతం సుప్రీం కోర్టు మందలించింది. ఈ తరుణంలో కలకత్తా పోలీసులు ఆమె పై లుక్ ఔట్ నోటీసు జారీ చేయడం గమనార్హం.