Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలవడిజ నాలుగు రోజులు గడుస్తున్నా సీఎం ఎవరు అన్నదానిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి. అధికారంలోకి రావడానికి తన కృషి ఉందని డీకే శివకుమార్, సీనియారిటీ, మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న కారణంగా తనకు అవకాశం ఇవ్వాలని సిద్ద రామయ్య ఇద్దరు ముఖ్యమంత్రి పదవికి పట్టుబట్టడంతో పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడింది. ఎట్టకేలకు బుధవారం ఉత్కంఠకు తెరపడింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ దాదాపు ఆరు గంటల పాటు చర్చలు జరిపారు. అనుభవానికి పెద్ద పీట వేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది. కర్ణాటక సీఎంగా సిద్ద రామయ్య పేరును దాదాపు ఖరారు చేసింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధికారికంగా సిద్ద రామయ్య పేరును ప్రకటించనున్నారు.
రేపు సీఎం గా సిద్ద రామయ్య ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సిద్ద రామయ్య పేరును ఖరారు చేసిన నేపథ్యంలో డీకే శివకుమార్ తో పార్టీ హైకమాండ్ పెద్దలు మాట్లాడుతున్నారు. మరో పక్క బెంగళూరులోని సిద్ద రామయ్య నివాసం వద్ద భద్రత పెంచారు. ప్రమాణ స్వీకారానికి విపక్ష నేతలను ఆహ్వానించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అనుభవం, ఎమ్మెల్యేల మద్దతు సిద్ద రామయ్యకు కలసి వచ్చిన అంశంగా ఉండగా, డీకే శివకుమార్ కు ఇడీ, సీబీఐ కేసులు అడ్డంకిగా మారాయి అని అంటున్నారు. అధిష్టానం నిర్ణయంపై డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఢిల్లీ నుండి బెంగళూరుకు చేరుకున్నారు.
తన ముఖ్య అనుచరులతో డీకే సమావేశం నిర్వహించనున్నారు. సిద్ద రామయ్య కేబినెట్ లో చేరాలన్న హైకమాండ్ నిర్ణయంపై డీకే శివకుమార్ అనుచరులు మండిపడుతున్నారు. సిద్దా రామయ్యకు రాహుల్ గాంధీ ఆల్ ద బెస్ట్ చెప్పడంతో ఆయన వర్గంలో సంబరాలు మొదలయ్యాయి. సిద్ద రామయ్య నివాసం వద్ద ఆయన అనుచరుుల సంబరాలు నిర్వహిస్తున్నారు. అయితే డీకే శివకుమార్ ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠ నెలకొంది. సిద్దా రామయ్య కేబినెట్ లో చేరతారా లేదా అనేది వేచి చూడాలి.
సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైఎస్ అవినాష్ రెడ్డి .. సీజేఐ ధర్మాసనం ఏమన్నదంటే ..?