Edible Oil: గత కొద్దికాలంగా షాక్ ఇస్తున్న వంట నూనెల ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వంట నూనెల దిగుమతి తగ్గించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా దేశీయ నూనె గింజల ఉత్పత్తి పెంచాలని … అందుకు మిషన్ ఆయిల్ ఫామ్ పథకాన్ని ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. గ్యాస్ ధరలు పెరిగాయన్న బాధలో ఉన్న ప్రజలకు ఈ రకంగా తీపికబురు చెప్పింది.
Read More: Cooking oil: ఈ వంట నూనె తో వండిన ఆహారం విషం తో సమానం ?? పిల్లల కైతే పొరపాటున కూడా పెట్టకండి!!
భారీగా పెరుగుతున్న వంట నూనెల ధరలు
ఇటీవల వంట నూనెల ధరలు అనూహ్యంగా పెరిగాయి. అయితే మన దేశంలో వాడే వంట నూనెల్లో సగానికి పైగా ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో బ్రెజిల్, అమెరికాలలో ఆయిల్ ముడి సరకుల ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. దీంతో నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు ఇండోనేషియా, మలేషియాలు ఎగుమతి సుంకాలు పెంచాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఏడాది మొదటి నుంచి నూనెల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలపై భారం తగ్గించేందుకు ఈ మధ్యే కేంద్రం వంట నూనెలపై పన్నులు తగ్గించినా ధరలు అదుపులోకి రాలేదు. దీంతో పామాయిల్ దిగుమతి తగ్గించి.. నేరుగా ఉత్పత్తి పెంచాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read More: Edible Oil: గుడ్ న్యూస్ః వంట నూనె ధరలు తగ్గుముఖం
అందుకే ఈ నిర్ణయం…
మనదేశంలో వేరుశనగ, పొద్దు తిరుగుడుతో పోల్చితే పామ్ ఆయిల్ సాగు తక్కువగా ఉంది. వంటనూనెల తయారీకి అవసరమైన పామాయిల్ సాగు పెంచితే నూనెల ధరలు అదుపులో ఉంచొచ్చని భావించి.. దేశంలో పామాయిల్ సాగును ప్రోత్సహించే చర్యలకు దిగింది. మిషన్ ఆయిల్ ఫామ్ అనే పథకాన్ని తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ పథకానికి గానూ.. కేంద్రం రూ.11,040 కోట్లు కేటాయించింది.