జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ సర్కార్ విశ్వస పరీక్షలో నెగ్గింది. కొద్ది సేపటి క్రితం అసెంబ్లీలో జరిగిన పరీక్షలో సోరెన్ కు మద్దతుగా 48 ఓట్లు వచ్చాయి. బీజేపీ బలపరీక్షను బాయ్ కాట్ చేసింది. బలపరీక్షకు ముందే బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు. తనంతట తానుగా మైనింగ్ గనుల లీజ్ కేటాయించుకున్నారన్న అభియోగంపై సీఎం సోరెన్ శాసనసభ్యత్వం రద్దు అవుతోందన్న ప్రచారం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు సోరెన్ శాసన సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. సోరెన్ శాసనసభ్యత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ లోపు తన ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని హేమంత్ సోరెన్ బలపరీక్షకు దిగారు. తాను బలపరీక్షలో నెగ్గడంతో మరో ఆరు నెలల వరకూ ప్రభుత్వానికి ఇబ్బంది ఉండే అవకాశాలు లేవు.
విశ్వాస పరీక్షకు ముందు సీఎం సోరెన్ కేంద్రంలోని బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వంటికి బట్టలు, రేషన్, కొనుగోలు చేస్తుంటారనీ, కానీ బీజేపీ మాత్రం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తొందని విమర్శించారు. దేశంలో తొలి గిరిజన మహిళ రాష్ట్రపతి ఎన్నిక అయిన తర్వాత గిరిజన ముఖ్యమంత్రిని గద్దె దించాలని చూస్తున్నారని ఆరోపించారు. సోరెన్ నేతృత్వంలో అధికార సంకీర్ణ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పాలిత చత్తీస్ గడ్ రాష్ట్రం నుండి ప్రత్యేక విమానంలో రాష్ట్ర రాజధాని రాంచీకి చేరుకున్నారు. బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందన్న భయంతో ముందుగా సోరెన్ ఎమ్మెల్యేతో ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. ఆదివారం రాత్రి రాష్ట్ర అతిధి గృహంలో ఎమ్మెల్యేలతో కలిసి బస చేసిన సీఎం సోరెన్ నేరుగా వారితో కలిసి అసెంబ్లీకి చేరుకుని బల నిరూపణ ఎదుర్కొన్నారు.
81 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీలో అధికార కూటమికి 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇందులో మెజారిటీ మార్క్ 41. అతిపెద్ద పార్టీ అయిన జేఎంఎంకి 30 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 18 మంది, తేజస్వి యాదవ్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్(ఆర్ జే డీ) కి ఒకరు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
సంఘ నేతల బహిష్కరణ పిలుపు బుట్టదాఖలు .. సీఎం జగన్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం