Maharastra: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు అజిత్ పవార్ బిగ్ షాక్ ఇచ్చారు. తన మద్దతుదారులతో అజిత్ పవార్ ఎన్డీఏలో చేరారు. ఆ వెంటనే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ పవార్ తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో చేరారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్ భవన్ కు వెళ్లిన ఆయన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉండగా, ఇప్పుడు రెండో డిప్యూటి సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు.
పవార్ తో పాటు ఛగన్ భుజ్ బల్, దిలీప్ వాల్సే పాటిల్, ధర్మారావ్ అట్రాం, సునీల్ వాల్సడే, అదితి తట్కర్, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, అనిల్ పాటిల్ మంత్రులుగా ముంబాయిలోని రాజ్ భవన్ లో ప్రమాణం చేశారు. అజిత్ పవార్ తో పాటు మొత్తం తొమ్మిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఆదివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం ఏక్ నాథ్ శిండే. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హజరైయ్యారు. రాజ్ భవన్ కు వెళ్లే ముందు పార్టీ ఎమ్మెల్యేలతో తన నివాసంలో అజిత్ పవార్ సమావేశమైయ్యారు. ఈ భేటీపై తనకు సమాచారం లేదని ఎన్సీపీ నేత శరద్ పవార్ పేర్కొనడం విశేషం. అయితే ఈ భేటీకి శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ కార్యనిర్వహక అధ్యక్షురాలు సుప్రీయా సూలే హజరు అయ్యారు. కానీ సమావేశం అనంతరం ఆమె రాజ్ భవన్ కు వెళ్లలేదు.
ఇటీవల ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తన కుమార్తె సుప్రీయా సూలే, ప్రపుల్ పటేల్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. అప్పటి నుండి అజిత్ పవార్ అసంతృప్తిగా ఉన్నారు. ఇదే అదునుగా సీఎం ఏక్ నాథ్ శిండే పావులు కదిపారు. అజిత్ పవార్ తో సంప్రదింపులు జరిపారు. అనంతరం ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏక్ నాథ్ శిండేతో కలిసి అజిత్ పవార్ సమావేశమైయ్యారు. ఇవేళ అకస్మాత్తుగా ఎన్డీఏలో చేరడం ఎన్సీపీలో తీవ్ర కలకలాన్ని రేపింది. ఎన్సీపీలో మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అజిత్ పవార్ కు 29 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రచారం జరిగింది. అయితే ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతు తెలిపారని మహరాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్ కులే తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం .. పిల్లలు సహా తల్లి ఆత్మహత్య