ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెగా రోడ్ షో నిర్వహించారు. దేశంలోనే అతి పెద్ద నగర రోడ్ షో .. అదీ 16 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 50 కిలో మీటర్ల మేర చేపట్టి మోడీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. 1995 నుంచి గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉండగా, వరుసగా ఏడోసారి అధికారంలోకి రావాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
గోద్రాలోని సబర్మతి ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం తర్వాత 2002లో జరిగిన అల్లర్లలో ఒకటైన నరోదా గామ్ నుండి మోడీ 50 కి.మీ రోడ్షో గురువారం నిర్వహించారు. థక్కర్బాపానగర్, బాపునగర్, నికోల్, అమ్రైవాడి, మణినగర్, డానిలింబ్డా, జమాల్పూర్ ఖాడియా, ఎలిస్బ్రిడ్జ్, వెజల్పూర్, ఘట్లోడియా, నారన్పూర్, సబర్మతి మీదుగా గాంధీనగర్ సౌత్ వరకూ ప్రధాని మోడీ రోడ్ జరిగింది. దారి పొడవుగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు జెండాలు ఊపుతూ బారులు తీరగా, ప్రధాని మోడీ పూలమాలలతో అలంకరించిన వాహనంపై ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.
మార్గమధ్యలో పండిట్ దిండయాళ్ ఉపాధ్యాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్తో సహా ప్రసిద్ధ వ్యక్తులను గౌరవించే స్మారక చిహ్నాల వద్ద ప్రధాన మంత్రి మోడీ ఆగి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2002 నుండి రాష్ట్ర అసెంబ్లీలో బిజేపీ సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. ఈ తరుణంలో ఈ సారి అసెంబ్లీలో 182 సీట్లలో 140 సీట్లను గెలవాలన్న లక్ష్యంగా బీజేపిటి పెట్టుకుంది. 2018లో బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీకి 77 సీట్లు వచ్చాయి. ఆ సారి ఆప్ రంగ ప్రవేశం చేయడంతో త్రిముఖ పోటీ నెలకొంది. గురువారం ఫస్ ఫేజ్ లో 89 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగ్గా, ఈ నెల 5వ తేదీన 93 స్థానాల్లో రెండో విడత పోలింగ్ జరగనుంది. 8వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు.