NCP: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీసుకున్న కీలక నిర్ణయం మహారాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో తీవ్ర ప్రకంపనలు రేపింది. పవార్ రాజీనామా ఉపసంహరించుకోవాలంటూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. పలువురు నేతలు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవార్ తన నిర్ణయంపై పునరాలోచనకు అంగీకరించారు. తనకు కొంత వ్యవధి ఇవ్వాలని, ఇందుకు రెండు, మూడు రోజులు అవసరం అవుతుందని పవార్ చెప్పినట్లు ఆయన మేనల్లుడు, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఇవేళ సాయంత్రం మీడియాకు తెలిపారు. పవార్ కుమార్తె సుప్రియా సులే, అజిత్ పవార్ తదితర నాయకులు శరద్ పవార్ తో భేటీ అయ్యారు. వీరంతా పవార్ తో మాట్లాడటంతో తన నిర్ణయంపై ఆయన పునరాలోచనకు అంగీకరించారు.
“నేను నా వరకూ నిర్ణయం తీసుకున్నాను. అయితే మీ అందరి కారణంగా నా నిర్ణయాన్ని పునరాలోచన చేస్తాను. నాకు రెండు మూడు రోజులు సయమం కావాలి. అది కూడా కార్యకర్తలు అందరూ ఇళ్లకు వెళ్లిపోతే ఆలోచిస్తాను. కొందరు పార్టీ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నారు. వెంటనే దీనిని ఆపేయాలి” అని పవార్ తమకు చెప్పినట్లు అజిత్ పవార్ మీడియాకు తెలిపారు. పవార్ నిర్ణయంతో పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, పార్టీ అధ్యక్షుడుగా పవార్ ఉంటూనే ఆయన కింద వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమించుకోవాలని తాము పెద్దాయన కు సూచించినట్లు అజిత్ పవార్ చెప్పారు. తమ మాటలను సావధానంగా పవార్ విన్నారనీ, నిరసన తెలుపుతున్న కార్యకర్తలతో మొదట మాట్లాడి ఆ తర్వాతే ఇక్కడకు తిరిగి రావాలని ఆయన సూచించారని తెలిపారు. 83 సంవత్సరాల పవార్ తన వయోభారాన్ని ప్రస్తావిస్తూ తన రాజీనామా నిర్ణయాన్ని ఈ ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Rahul Gandhi: గుజరాత్ హైకోర్టులోనూ రాహుల్ కు దక్కని ఊరట .. పరువు నష్టం కేసులో స్టేకు నిరాకరణ
Sharad Pawar will take 2-3 days to reconsider his decision to quit as NCP chief: Ajit Pawar
Read @ANI Story | https://t.co/KbE2ProhJ4#AjitPawar #sharadpawar #NCP pic.twitter.com/PsUQo1vN0b
— ANI Digital (@ani_digital) May 2, 2023