Kalyanadurgam (Anantapur): కళ్యాణదుర్గం పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో మంగళవారం రిటైర్డ్ ఉద్యోగులు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన సీఎఫ్ఎంఎస్ కు ఆధార్ అనుసంధానం చేయు విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తపరిచామన్నారు. విశ్రాంత ఉద్యోగుల వయస్సు రీత్యా అనారోగ్య పరిస్థితుల కారణంగా మంచానికి పరిమితమై కదలలేని పరిస్థితిలో ఉన్న విశ్రాంత ఉద్యోగులు ఈకేవైసీ అందజేయలేరన్నారు. కావున విశ్రాంత ఉద్యోగులకు ఈకేవైసీ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
ఈ మేరకు సమస్యలపై ఉప ఖజానా అధికారి శ్రీనివాసులుకి విశ్రాంత ఉద్యోగులు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు శివప్రసాద్, తిప్పేస్వామి, మారెన్న, అంజనప్ప, ఫకృద్దీన్, ప్రకాష్ రావు, వీరభద్రయ్య, భగవాన్ దాస్, ప్రసాద్, చెన్నప్ప, ఓబులేసు, లింగప్ప తదితరులు పాల్గొన్నారు.
NCP: పార్టీ శ్రేణుల ఒత్తిడితో పునరాలోచనలో ఎన్సీపీ నేత శరద్ పవార్