ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో అట్టహాసంగా, ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో 108 అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించారు. జూలై 1వ తేదీన ప్రారంభించిన సర్వీసులు ఆశించినట్టుగా పని చేస్తున్నాయా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఈ నెల రోజుల్లో వాటి పనితీరును సమీక్షిస్తే కేవలం 30 శాతం మాత్రమే సక్సెస్ రేటు కనిపిస్తోందనే వార్తలు వస్తున్నాయి. కరోనా కారణంగా డ్రైవర్లు అందుబాటులో లేకపోవడం, వారికే కరోనా సోకడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 108 సర్వీసులు సకాలంలో అందక కొందరి ప్రాణాలు కూడా పోతున్నాయి.అధునాతల టెక్నాలజీని ఈ ఆంబులెన్సుల్లో ఏర్పాటు చేశారు.
అయితే.. బాధితుల ఫోన్ కాల్ చేసిన 15 నిముషాల్లోనే అందుబాటులోకి రావాల్సి ఉన్నా రావడం లేదు. కొన్నిచోట్ల గంటల్లో కూడా ఆలస్యమవుతున్నాయి. కరోనా కేసుల్లో సరైన సమయంలో వైద్యం అందటం లేదు. చాలా చోట్ల మున్సిపాలిటీ బండ్లలో, ఆటోల్లో బాధితులను చేరవేస్తున్నారు. కొందరు ప్రైవేటు ఆంబులెన్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆస్పత్రికి చేరేలోపే ప్రాణాలు పోతున్నాయి.
ఇదే అవకాశంగా ప్రైవేటు ఆంబులెన్సులు దోపిడీకి పాల్పడుతున్నాయి. మండలానికో ఆంబులెన్సు ఉన్నా ప్రజలకు ఉపయోగపడడం లేదని ప్రతిపక్షాలు కూడా గొంతెత్తుతున్నాయి.nగతంలో జీవీకే సంస్థ ఆధ్వర్యంలో ఈ సర్వీసుల నిర్వహణ సరిగా లేదంటూ అరబిందో సంస్థకు అప్పజెప్పారు. ఇప్పుడు అరబిందో నిర్వహణలో కూడా ఈ జాప్యం జరిగితే సంస్థతోపాటు ప్రభుత్వం కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.
\కొన్నిచోట్ల నిర్వహణ బాగున్నా అక్కడక్కడా క్షేత్రస్థాయిలో సరైన పనితీరు సరిగా లేకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సిందే. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం నిత్యం జాగ్రత్తగా ఉండాల్సిందే. సిబ్బందిని నియమించుకోవడం, పర్యవేక్షణ తప్పనిసరి చేయాల్సిందే. ఇందులో అరబిందో సంస్థ కూడా బాధ్యత తీసుకోవాల్సిందే. సీఎం జగన్ 108 నిర్వహణపై మరోసారి అధికారులతో సమీక్ష నిర్వహించి లోపాలను సరిదిద్దాల్సి ఉంది.