Aaradugula bellet – Kondapolam: దాదాపు ఏడు సంవత్సరాల క్రితం తెరకెక్కిన సినిమా ఆరడుగుల బుల్లెట్. మాచో హీరో గోపీచంద్, నయనతార జంటగా సీనియర్ స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వం వహించాడు. తాండ్ర రమేశ్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించారు. అయితే నిర్మాణంలో జాప్యం..ఇతర కారణాల వల్ల అప్పుడు ఇప్పుడు అనుకుంటూ ఎట్టకేలకి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్కు ముందు దర్శకుడు బి.గోపాల్ చాలా హైప్ క్రియేట్ అయ్యేలా మాట్లాడారు. దానితో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
స్టార్ హీరోయిన్ నయనతార కావడం కూడా సినిమా మీద భారీ స్థాయిలో అంచనాలు పెరగడానికి ఓ ప్రధాన కారణం. అయితే గోపీచంద్ కి మంచి హిట్ దక్కి దాదాపు మూడేళ్ళు దాటిపోయింది. ఇటీవలే సీటీమార్ సినిమాతో వచ్చి ఒక మోస్తారు హిట్ అందుకున్నాడు. ఆ సినిమా రిజల్ట్ చూసి ఆరడుగుల బుల్లెట్ రిలీజ్ చేయాలని ఆగమేఘాల మీద రెడీ అయ్యారు. ఎటూ దాదాపు రెండేళ్ళుగా థియేటర్స్లో సినిమాలు చూడక జనాలు కూడా బాగానే ఆసక్తి చూపించారు. ఇవన్నీ ఆరడుగుల బుల్లెట్ సినిమాకు కలిసి వస్తాయని మేకర్స్ భావించారు.
Aaradugula bellet – Kondapolam: ఈ సినిమాలను పోటీపడి డిస్ట్రిబ్యూటర్స్ కొన్నారు.
కానీ సినిమా పెద్ద డిజాస్టర్గా మిగిలింది. ఈ సినిమా రిలీజ్ చేయకపోయినా కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ధిక ఇబ్బందుల్లో పడేవారు కాదు. ఈ సినిమా కొని అనవసరంగా నష్టాలను మూటగట్టుకున్నారు. మరి ఏ బేస్ మీద సినిమాను డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్నారో గానీ ఖచ్చితంగా నష్టాలను మాత్రం భరించాల్సిన పరిస్థితి వరిది. ఇదే కాదు అగ్ర దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కొండపొలం. ఈ సినిమా చేయడం పెద్ద సాహసం. కోవిడ్ విలయతాండవం ఆడుతున్న సమయంలో దాదాపు 300 మంది చిత్ర యూనిట్ సభ్యులతో వికారాబాద్ ఫారెస్ట్లో షూటింగ్ జరిపారు.
ఉప్పెన సినిమాతో హీరోగా మారి దాదాపు 25 ఏళ్ళ నుంచి ఉన్న డెబ్యూ హీరో రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ రెండవ సినిమాగా కొండపొలం చేయడం విశేషం. గత కొంతకాలంగా సక్సెస్లు లేని రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాతో హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకోవాలని తాపత్రయపడింది. కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కేవలం 40 నుంచి 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశారు. సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రిష్ ఫేమ్, వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా సక్సెస్తో ఈ సినిమాను పోటీపడి డిస్ట్రిబ్యూటర్స్ కొన్నారు.
Aaradugula bellet – Kondapolam: మర్చిపోయిన సినిమాలను రిలీజ్ చేయకూడదని..మరీ ప్రయోగాలు చేయకూడదు..
కానీ కొండపొలం సినిమాకు డివైడ్ టాక్ వచ్చి మెగా అభిమానులను నిరాశపరచింది. వైష్ణవ్ తేజ్కి రెండవ సినిమా ఫ్లాప్గా మిగిలింది. రకుల్ పెట్టుకున్న ఆశలు ఆవిరి. ఓ మంచి సినిమా చేశామన్న సంతృప్తి తప్ప డిస్ట్రిబ్యూటర్స్కు మాత్రం ఆర్ధికంగా నష్టాలు తప్పలేదని టాక్ వచ్చింది. మొత్తానికి మంచి అంచనాలతో వచ్చిన కొండపొలం, ఏడేళ్ళ క్రితం రావాల్సిన ఆరడుగుల బుల్లెట్ సినిమా ఇప్పుడు వచ్చి నిరాశ, నష్టాలను మిగల్చడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చలకు దారితీస్తున్నాయి. దీనినిబట్టి మర్చిపోయిన సినిమాలను రిలీజ్ చేయకూడదని..మరీ ప్రయోగాలు చేయకూడదని అర్థమవుతోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!