ఆదాయానికి మంచి ఆస్తులు కలిగి ఉన్నాయనే అభియోగాలపై మల్కాజ్ గిరి ఏసీపీ గా పనిచేస్తున్న నర్సింహా రెడ్డి ఇల్లు, కార్యాలయంలో ఏసీబీ దాడులు చేస్తుంది. గతంలో ఉప్పల్ సీఐ గా పనిచేసిన నర్సింహారెడ్డి అనేక ల్యాండ్ సెటిల్ మెంట్లు, భూ వివాదాల్లో తలదూర్చి సెటిల్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపధ్యంలో అక్రమ ఆస్తులు కూడగట్టారని ఆయనపై ఫిర్యాదులు రావడంతో ఏసీపీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తుంది, ఏసీపీ కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లోని ఆయన ఇళ్లలోనూ, బంధువుల ఇళ్లలోనూ…మొత్తం 34 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు జరుగుతున్నాయి. కేవలం హైదరాబాద్ లోనే 20 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆరుగురు బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తుంది. ఈ నేపధ్యంలో ఆయన ఎంత మేరకు అక్రమాస్తులు కూడగట్టారు అనేది చర్చనీయాంశంగా మారింది.