కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలన్ని గడగడలాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా అంతా సద్దుమణుగుతోంది. అయితే ఈ కరోనా వల్ల అన్ని ఇండస్ట్రీస్ అగాధం లో కూరుకుపోయాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ కి వేల కోట్లలో వ్యాపార నష్టం వాటిల్లింది. దాదాపు ఆరు నెలలుగా చిత్రీకరణలు నిలిచిపోయాయి. అంతేకాదు కొత్త సినిమాలేవి ప్రారంభోత్సవం జరుపుకోలేదు.
అంతేకాదు థియోటర్స్ మూత పడి కూడా 6 నెలలు కావస్తుంది. ఎప్పుడు ఓపెన్ అవుతాయో కూడా తెలియడం లేదు. దాంతో ఒక్కొక్కటిగా సినిమాలన్ని ఓటీటీలో నేరుగా రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో నిర్మాతలు ఆయా చిత్రాలలో నటించిన హీరో, హీరోయిన్స్ ని తమ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఒప్పిస్తున్నారట. ఇటీవల ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కూడా హీరో నాని తో చాలా రోజులు చర్చలు జరిపి వి సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఒప్పించారట.
అలాగే కోన వెంకట్ కూడా నిశ్శబ్దం సినిమాని డిజిటల్ తెరపై విడుదల చేసేందుకు అనుష్క శెట్టి తో చర్చలు జరిపి ఒప్పించారని తెలుస్తుంది. మొత్తానికి నాని, అనుష్క శెట్టి సినిమాలు ఓటీటీ లలో విడుదలకు రెడి అయ్యాయి. హీరో నాని నటించిన వి సినిమా సెప్టెంబర్ నెల 5వ తేదీన విడుదల కానుంది. అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్దం సినిమా వచ్చే నెలలో విడుదల కానుందని అంటున్నారు. ఇక ఈ ఇద్దరు ఎస్ అన్న కారణంగా మిగతా వాళ్ళ సినిమాలు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.
ఇక బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు కూడా తమ సినిమాలను ఓటీటీ లలో విడుదల చేసేందుకు యస్ అంటున్నారు. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అలియా భట్, అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ నటించిన సినిమాల పై నిర్మాతలకి లాస్ రాకూడదన్న ఉద్దేశ్యంతో తమ సినిమాలను డిజిటల్ రిలీజ్ లకు ఓకే చెప్పేశారు. ఇక ఈ విషయంలో కోలీవుడ్ స్టార్ హీరోలు అందరికంటే ముందున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!